వరంగల్ తూర్పులో బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ప్రారంభం

నేటిధాత్రి, వరంగల్ తూర్పు

వరంగల్ తూర్పు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తూర్పు ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ వచ్చే 45 రోజులపాటు టిఆర్ఎస్ పార్టీని తూర్పు నియోజకవర్గంలో ప్రతి గడపకు చేరేలా కృషి చేస్తాం అని తెలియచేశారు. కార్యక్రమ వివరాలు తేదీల వారీగా తెలియచేశారు.

ఏప్రిల్ 12 నుండి 17 వరకు ఇంటింటికి బొట్టు పెట్టి, ఆహ్వాన పత్రిక అందచేసే కార్యక్రమం

ఏప్రిల్ 18 నుండి 24 వరకు ప్రతి డివిజన్లో 500 మంది ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు

ఏప్రిల్ 25వ తేదీన, వరంగల్ తూర్పు 35వ డివిజన్లో మొదటి ఆత్మీయ సమావేశం కానుంది

మే 13 నుంచి 31 వరకు ప్రతి డివిజన్లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది.

 

మే 7, 8 తేదీలలో కార్మికులతో సమీక్ష, వారికి లేబర్ కార్డు నన్నపనేని నరసింహమూర్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పించడం జరుగుతుంది

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పార్టీ నుంచి తొలగించబడుతుంది

జీవో నెంబర్ 58, 59 ప్రకారం గుడిసె వాసులకు వారి వద్దకు వెళ్లే పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. పట్టాలకు అయ్యే ఖర్చులు కూడా నన్నపనేని ట్రస్ట్ భరిస్తుంది అని తెలియచేశారు

కావాలని డిస్టర్బ్ చేసిన వారి మీద క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. క్రమశిక్షణకు మారు పేరు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు

ప్రతి డివిజన్ లో 2000 మందితో కూడిన సమ్మేళనం ఉంటుంది అందరికీ భోజనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అని అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *