వంట కార్మికులకు పెంచిన వేతనాలు ఖాతాలలో జమ చేసేవరకు సమ్మెకొనసాగిస్తామన్న వంట కార్మికులు

ములుగు, నేటిధాత్రి:

ఏఐటియుసి16వ రోజు సమ్మెలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు వంట కార్మికులు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందించడం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గున్నాల రాజకుమారి గారు మాట్లాడుతూ 16 రోజులుగా సమ్మె చేస్తున్న సందర్భంలో ప్రభుత్వం బడ్జెట్ విధి చేసినట్లు ప్రకటించడం జరిగినది కానీ పెంచిన వేతనాలు ఇప్పటివరకు ఖాతాలలో జమ కాలేదు అన్నారు కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి వచ్చిన వేతనాలను కార్మికుల ఖాతాలలో జమ చేసే వరకు సమ్మె కొనసాగుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు జేరిపోతుల పైడిబాబు, శ్రీనివాస్ పాల్గొన్నవారు ఉమాదేవి, లక్ష్మి ,రవీంద్ర లలిత రమ్యకృష్ణ రజిత సూరమ్మ కౌసల్య లక్ష్మి భాగ్య పద్మ స్వరూప పద్మ సౌందర్య లక్ష్మి రజిత సునిత పద్మ రాజక్క*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!