బీఆర్ఎస్ పథకాలు, అభివృద్ది పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ప్రతీ గ్రామంలో పార్టీ సమావేశాలు జరగాలి
ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం
వేములవాడ,నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రానున్న వంద రోజులు కీలకమని,
బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన పథకాలు, అభివృద్ది పనులను నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని
ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పిలుపునిచ్చారు. గురువారం
వేములవాడ రూరల్ మండల బీఆర్ఎస్
పార్టీ నాయకుల, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని చెక్క పల్లి
గ్రామంలో ఎంఎల్ఏ రమేష్ బాబు అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ
సందర్భంగా శాసనసభ్యులు రమేష్ మాట్లాడుతూ పార్టీ ఎన్నో రకాల సర్వేలు చేసిందని,
అన్ని సర్వేలలో గెలుపు బీఆర్ఎస్ ముందున్నమని అన్ని సర్వేలలో తేలిందని
అన్నారు. పార్టీ ఏ పిలుపు ఇచ్చిన
కార్యక్రమాలు కలిసికట్టుగా, సమిష్టిగా విజయవంతం చేస్తున్న నాయకులు,
కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతిష్టాత్మకంగా ప్రతి వంద మందికి ఒక బూత్
కమిటీని వేసుకుందామని, దానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమాయత్తం
కావాలని అన్నారు. ప్రతి గ్రామంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ
పథకాలైన రైతు బందు, రైతు భీమా, దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు,
కళ్యాణ లక్ష్మి, రుణ మాఫీ, ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్, కేసీఆర్ కిట్, కంటి
వెలుగు, కళ్యాణ లక్ష్మి, మహిళా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు, కుల సంఘాల
భవనాల నిర్మాణాలు, మత్స్య కారులకు చేపల పంపిణీ, గీత కార్మికులకు ఆర్థిక
సహాయం, వైకుంఠ దామాల, క్రీడా ప్రాంగణాలు, ఆర్టీసీ ఉద్యోగస్తుల విలీనం ఇలా
ఎన్నో కార్యక్రమాలను ప్రజలకు తెలిసేలా పార్టీ యంత్రాంగం కృషి చేయాలని
అన్నారు. రానున్న వంద రోజులు కీలకం అని, ఇప్పుడే పార్టీ యంత్రాంగం
కీలకంగా వుండాలని అన్నారు. ప్రతి గ్రామంలో పార్టీ సమావేశాలు జరగాలని
అన్నారు. రానున్న రోజులో అన్ని పథకాలను పారదర్శకంగా ఎంపిక
చేస్తామన్నారు. దేశంలో ఎక్కడా జరగని సంక్షేమ పథకాలు తెలంగాణాలో
జరుగుతున్నాయని, దేశంలో తెలంగాణా ఆదర్శంగా వున్నదని అన్నారు. రాష్ట్రంలో
ఆదాయం గణనీయంగా పెరిగిందని అన్నారు. అతి త్వరలో సీఎం జిల్లాకు
రానున్నారని అన్నారు. సూర్యోదయం, సూర్యాస్తమయం ఎలాగో కేసీఆర్ గారు మూడవ
సారి సీఎం కావడం తథ్యమన్నారు. ఏ ఆపద వచ్చిన ప్రతి కార్యకర్తను
ఆదుకుంటామని అన్నారు. పార్టీలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని వేములవాడ
నియోజకవర్గం క్రమశిక్షణకు మారుపేరని, రమేష్ బాబుని, వారి వెనుక వున్న
సైన్యాన్ని ఎవరు బదనాం చేయలేరని తెలిపారు. అనంతరం జిల్లా పార్టీ
అధ్యక్షులు తోట ఆగయ్య మాట్లాడుతూ మంత్రి కేటిఆర్ ఆధ్వర్యంలో జిల్లా
టిఆర్ఎస్ పార్టీ పటిష్టంగా వుందని, అభివృద్ధిలో ముందుందని అన్నారు. ఏ
ఎన్నికలు వచ్చినా గెలుపు మనదేనని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్
ఆధ్వర్యంలో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు చేరుతున్నాయని, వాటిని తెలియ
పరచవలసిన బాధ్యత మనందరి బాధ్యత అన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి యేష వాణి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్
బాలరెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి, సెస్ డైరెక్టర్ ఆకుల
దేవరాజం, మాజీ మార్కెట్ చైర్మన్ గడ్డం హనుమాండ్లు, పార్టీ మండల
అధ్యక్షులు గోస్కుల రవి, సర్పంచులు, ఎంపిటిసీలు, అన్ని గ్రామాల పార్టీ
అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు
పాల్గొన్నారు.