ఖమ్మం ముస్తఫానగర్ లో అయ్యప్ప మాల దారుల కోసం ఐదేళ్లుగా శ్రీదివ్య మణికంఠ అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో ప్రతి ఏటా 41రోజుల పాటు అయ్యప్ప స్వాములకు అన్నదానం చేస్తుండం తెలిసిందే.ఈ పుణ్య కార్యానికి ఎంపీ రవిచంద్ర సోమవారం హాజరై లక్ష రూపాయలు విరాళంగా అందించడం జరిగింది.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర అయ్యప్ప స్వాములతో కలిసి పూజలో పాల్గొన్నారు, వారికి స్వయంగా భోజనం వడ్డించారు.గత ఐదేళ్లుగా అయ్యప్ప స్వాములకు క్రమం తప్పకుండా అన్నప్రసాదం అందించడం గొప్ప విషయమని ఎంపీ వద్దిరాజు నిర్వాహకులను కొనియాడారు.ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ,అన్నదాన సేవా సమితి అధ్యక్షులు చిర్రా రవి స్వామి,పుట్ట మల్లికార్జున్,మాచర్ల నరేష్,నిదిగొండ శేఖర్,రవితేజ, చరణ్, గురుబ్రహ్మం, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర శ్రీదివ్య మణికంఠ అన్నదాన సేవా సమితికి లక్ష రూపాయల వితరణ
