రాజకీయ తులాభారంలో  జగన్‌ వైపే జనం మొగ్గు!

` జగనే మళ్ళీ సిఎం డి.ప్యాక్‌ కధనంపై సర్వత్రా చర్చ.

` వైసిపి సర్వేలకు సమానమైన లెక్కలు చెప్పిన డి.ప్యాక్‌.

`డీ ప్యాక్‌ సర్వే వివరాలతో ప్రతి పక్షాలలో గందరగోళం.

` డీ ప్యాక్‌ సర్వే వివరాలు తెలుసుకునే ప్రయత్నం.

`ఎలా సాధ్యమన్న దానిపై ప్రతిపక్షాల ఆసక్తి?

` వైసిపిలో కూడా మొదలైన చర్చ?

`నేటిధాత్రి లో కథనం వచ్చిన రోజే సిఎం. జగన్‌ ఎమ్మెల్యేలతో బేటీ?

` ప్రజలలో వైసిపిపై అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం.

` సర్వేలు డేగ కన్నుతో ప్రజల ఆలోచనలు పసిగడుతున్నాయి!

` సర్వేల ద్వారా పరిస్థితి వివరిస్తున్నాయి!

`ఇప్పటికైనా జనంలో వుండండి. ఎమ్మెల్యేలకు సిఎం. జగన్‌ ఆదేశం.

` జనంలో వుండే ఎమ్మెల్యేలకే టిక్కెట్లు అని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టీకరణ?

` నేటిధాత్రి పత్రికలో వచ్చిన వార్తపై సర్వత్రా నెలకొన్న ఆసక్తి!

` జగన్‌ వైపే జనం మొగ్గు అన్నది డి.ప్యాక్‌ తో అందరిలో నానుతున్న మాట.

`ప్రతిపక్షాల పరిస్థితి ఎలా వుంటుందనే వివరాలు తెలుసునే ప్రయత్నం.

`భవిష్యత్తు రాజకీయాలపై నేటిధాత్రి కి ఫోన్‌ చేస్తున్న పార్టీల నేతలు

హైదరబాద్‌,నేటిధాత్రి: 

ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి ది ధైర్యమో, తెగింపో గాని ఈ సమయంలో జాగ్రత్తగా మాట్లడకపోతే ఎమ్మెల్యేలు చే జారిపోతారేమో! అన్న భయం ఆయన లో లేదు. అందుకే బుధవారం జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో మరోసారి ఎమ్మెల్యేను హెచ్చరించారు. గతం నుంచి కూడా ఇదే చేస్తున్నారు. కానీ అప్పుడు వేరు. ఇప్పుడు వేరు. అప్పుడు ఎన్నికలకు చాలా సమయం వుంది. ఇప్పుడు ఎన్నికలకు కొద్ది సమయమే వుంది. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి జగన్‌ 84 మంది ఎమ్మెల్యేల పని తీరు బాగా లేదని హెచ్చరికలు జారీ చేశారు. ఆ తర్వాత 74 మంది ఎమ్మెల్యేలు తేల్చారు. ఆ తర్వాత 53 మంది ఇంకా మారలేదని గుర్తు చేశాడు. ఆ మధ్య 22 పేర్లు చెప్పేశాడు. టిక్కెట్లు ఇవ్వడం కుదరదని వారి ముఖం మీదే చెప్పేశాడని జరిగిన ప్రచారం చూస్తున్నాం. అందులో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వదిలేశారు. తాజాగా బుధవారం జరిగిన సమావేశంలో 18 ఎమ్మెల్యేలకు జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అక్టోబర్‌ లోపు మీ పని తీరులో మార్పు రాని పక్షంలో టిక్కెట్లు ఇవ్వడం కచ్చితంగా కుదరదని వారి తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇదంతా నేటిధాత్రి లో కథనం వచ్చిన రోజే జరగడం గమనార్హం. 

ఇప్పుడున్న పరిస్థితుల రాజకీయ తులాభారంలో 

జగన్‌ వైపే జనం మొగ్గు! అన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. జనం గురించి ఆలోచించే నేత ఎవరైనా వున్నారంటే అది జగనే అనే అభిప్రాయం సామాన్యులు వ్యక్తం చేస్తుండడం గమనార్హం. అయితే ఎంతటి సంక్షేమ ప్రభుత్వమైనా సరే కొన్ని సార్లు ఐదేళ్ల తర్వాత ప్రజా వ్యతిరేకత కనిపించడం కామన్‌. ఇటీవల ప్రజల తీర్పులో కూడా మార్పులు వస్తున్నాయి. ఐదేళ్ల పాలన పూర్తయినా, జరిగిన ఎన్నికలలో అంతకు ముందు కంటే ఎక్కువ మెజారిటీతో తెలంగాణ లో బిఆర్‌ఎస్‌ గెలవడం చూశాం. కేంద్రం లో బిజేపి చూశాం. కానీ ఆంద్రప్రదేశ్‌ పరిస్థితి కొంత భిన్నం. నిజానికి ముఖ్యమంత్రి జగన్‌ తాను అనుకున్నది కచ్చితంగా చేస్తారని ప్రజలకు నమ్మకం. ఆ నమ్మకం తోనే గతంలో ఎవరికీ ఇవ్వని మెజారిటీ సీట్లు ఇచ్చి ప్రజలు గెలిపించుకున్నారు. అయినా రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్‌ అంచనాలు తలకిందులయ్యాయని మాత్రం చెప్పొచ్చు. పోలవరంపై ప్రజల నమ్మకాన్ని జగన్‌ పూర్తి చేయలేదు. ఇది కొన్ని ప్రాంతాలలో ప్రభావం చూపుతుంది. అదే విషయాన్ని నేటిధాత్రి నిర్మొహమాటంగా చెప్పింది. ప్రజలు ఏమనుకుంటున్నారో నిజంగా చెప్పగలిగినప్పుడే ఆ సర్వే సంస్థకు క్రెడిబిలిటీ పెరుగుతుంది. ఇదే ముఖ్యమంత్రి జగన్‌ కు కూడా నచ్చుతుంది. నేటిధాత్రి కథనంలో చెప్పిన దాదాపు అవే అంశాలను కూడా ఎమ్మెల్యేల సమావేశంలో జగన్‌ ప్రస్తావించారన్న సంగతి తెలిసిందే. 

జగనే మళ్ళీ సిఎం డి.ప్యాక్‌ కధనంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. డి.ప్యాక్‌ సర్వే 

వైసిపి సర్వేలకు సమానమైన లెక్కలు చెప్పినట్లు గమనించారు. అందుకే వెంటనే ఎమ్మెల్యేల సమావేశం జరిగినట్లు కూడా తెలుస్తోంది. 

 డీ ప్యాక్‌ సర్వే వివరాలతో ప్రతి పక్షాలలో గందరగోళం నెలకొన్నట్లు కూడా సమాచారం అందుతోంది. ప్రతిపక్షాలు చేయించుకుంటున్న సర్వేలను వాళ్లే నమ్మడం లేదు. కేవలం మొహమాటానికో, మరే అవసరానికో సర్వే సంస్థలు కొన్ని నిజాలు దాచుతుంటాయి. అందుకు ఒక సంఘటన గురించి ఇక్కడ చెప్పుకుందాం. గతంలో ఓ సీనియర్‌ మంత్రి తెలుగుదేశం లో కీలక భూమిక పోషిస్తూ వుండేవారు. అప్పట్లో ఎవరికి టిక్కెట్‌ వస్తుంది? ఎవరికి రాదు…అనే విషయాలు ఆయన వెల్లడిస్తుండే వారు. అలాంటి నాయకుడు తనకు టికెట్‌ వస్తుందో లేదో అన్న ఆందోళనను ఓ విలేఖరి తో పంచుకున్నాడు. అది అప్పట్లో పెద్ద సంచలనమైంది. సర్వే సంస్థలు కూడా అలా మారిపోయాయి. అందుకే డీ ప్యాక్‌ సర్వే వివరాలు తెలుసుకునే ప్రయత్నం తెలుగు దేశం, జనసేన పార్టీలు చేస్తున్నాయి. 

సర్వే వివరాలలో కొన్ని కచ్చితమైన లెక్కలు చెప్పడంలో డి. ప్రత్యేకతను ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. అది ఎలా సాధ్యమన్న దానిపై ప్రతిపక్షాల ఆసక్తి? మరింత పెరిగిపోతోంది. ఇదే ఆసక్తి వైసిపిలో కూడా కనిపిస్తోంది. అందుకే వైసిపిలో కూడా చర్చ మొదలైంది. అసలు గెలిచే ఆ వంద సీట్లు ఏవి? అన్నది తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *