యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు ఘన సన్మానం

మందమర్రి, నేటిధాత్రి:-

పట్టణ మున్సిపల్ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ వెంకటేశ్వర్లు ను సోమవారం పట్టణ మున్సిపల్ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎండి నయిమ్ మాట్లాడుతూ, పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలను నూతన మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకుపోగా సమస్యలపై ఆయన సానుకూలంగా స్పందించి, సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు ఐద కమలాకర్, చింటూ, ఏదుల రాజశేఖర్, రాం శివ, భీమినేని భాస్కర్, ఐద సుధాకర్, ఎండి అక్బర్ బాషా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *