మోసపూరిత మాటలతో ప్రజల్ని మభ్య పెడుతున్న రసమయి.మండల కాంగ్రెస్ అద్యక్షుడుపసుల వెంకటి

ఇల్లంతకుంట : నేటి ధాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మానకొండూరు నియోజకవర్గ శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత అని చెప్పుకునే రసమయి బాలకిషన్ మానకొండూరు ప్రజల ఓట్లతో గెలిచి మానకొండూరుకు ఏమి చేయలేని నీవు మునుగోడు నియోజకవర్గంలో మానకొండూరు ప్రజల డబ్బును రెండు కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తానని తప్పుడు మాటలు చెప్పే నాయకుడా అంటూ మండల కాంగ్రెస్ అద్యక్షుడు పసుల వెంకటి విమర్శించారు.ఇక్కడ ప్రజలు వేసిన ఓట్లు కాదా మీకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ప్రజలను మరిచిపోయి 170 గజాల జాగా ఉన్న వ్యక్తికి మానకొండూరు ప్రజలు పెట్టిన బిక్షతో వందల ఎకరాల భూమి సంపాదించి నాలుగైదు ఇల్లు కట్టుకొని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని సంపాదించి మానకొండూర్ ప్రజల సొమ్ముతో తిరుగుతూ ఈ నియోజకవర్గ ప్రజలను మరచి ఎక్కడో ఉపఎన్నిక వచ్చిన మునుగోడు నియోజకవర్గం ప్రజలకు రెండు కోట్ల రూపాయల అభివృద్ధి చేస్తామని అనడం అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయించినట్టు ఉన్నది నీ వ్యవహారం ఇకనైనా మానకొండూరు ప్రజలు గ్రహించాలి.ఇటువంటి ఎమ్మెల్యేలను మనం ఎందుకు ఎన్నుకున్నాను అని ఇప్పుడు బాధ పడుతున్నారు.రాబోయే రోజుల్లో అభివృద్ధి ప్రదాత అని చెప్పుకునే వలస ఎమ్మెల్యేలను తరిమి తరిమి కొట్టాలని ప్రజలు ఆలోచన చేస్తున్నారు.ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వ్యవహారం ప్రజలారా తస్మాత్ జాగ్రత్త భవిష్యత్తులో ఇటువంటి నాయకులను నమ్మి మోసపోవద్దని పసుల వెంకటి ఒక ప్రకటనలో తెలిపారు.రాబోయే రోజుల్లో గడీల పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారు అని తెలుపడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అల్లెపు రజనీకాంత్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు జమాల్ మరియు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *