మోరాంచపల్లి గ్రామాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి

సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ మాకినేని బసవపు ఉన్నాయా మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆర్థిక సహకారం అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆ గ్రామాన్ని కుటుంబాల్ని సందర్శించి పరామర్శించిన సిపిఐఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతునేని సుదర్శన్ రావు మాట్లాడుతూ జిల్లాలోని మోరంచ పల్లె గ్రామానికి 27/07/23 రోజున ఆకస్మాత్తుగా వచ్చిన వరదల వల్ల తీవ్ర నష్టం జరిగిందని ప్రజలు సర్వం కోల్పోయారని 159 బర్రెలు ఆవులు పశువు సంపద మరియు నలుగురు చనిపోయారని తీవ్ర ఆస్తి నష్టం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సిపిఐఎం పార్టీ జిల్లా కమిటీ మరియు మాకినేని బసవన్నయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిన్న సాయంగా చనిపోయిన కుటుంబాలకు 5000 రూపాయలు అదేవిధంగా దాదాపు 170 కుటుంబాలకు లక్ష ఇరవై వేల ఆర్థిక సాయం చేయడం జరిగిందని ఇది మాత్రమే సరిపోదని ఇవేకాక స్వచ్ఛంద సంస్థలు ట్రస్టులు ఇతరత్రా పార్టీలు ఎంతో మంది సాయం చేశారని అవి ఏమాత్రం సరిపోవని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుల చట్టం కింద ఈ గ్రామాన్ని తీసుకొని సిపిఐఎం పార్టీ ప్రజల సమస్యలపై పోరాడేందుకు మరియు ప్రజా సమస్యల్ని ప్రభుత్వాలకి చేరవేసి పరిష్కారం అయ్యే విధంగా పోరాటాల నిర్వహించినందుకు ఈ జిల్లా ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందని మోరంచపల్లి గ్రామ ప్రజలకు ఆయన ధైర్యం అందించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు జిల్లా కమిటీ సభ్యులు గుర్రం దేవేందర్ వెలిశెట్టి రాజయ్య ప్రీతి శ్రీకాంత్ నాయకులు రవి వంగాల లక్ష్మి కోమల శ్రీలత సుజాత సరిత నవీన్ ప్రవీణ్ ఉష లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!