చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని గుంటూరు పల్లె గ్రామ ప్రజలు తన మానవత్వాన్ని చాటుకున్నారు వివరాల్లోకి వెళితే మొరంచ పల్లి లోగత కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు గ్రామము అంతా నీటమునిగి ఏమి లేని ఆనాధలు గా మిగిలిన భూపాలపల్లి మండలం మోరాంచపల్లి గ్రామ ప్రజలకు మీకు మేమున్నాము బాధ పడకండి అంటూ చిట్యాల మండలం గుంటూరు పల్లి గ్రామ ప్రజలు చేయూత ని అందించారు.గుంటూరు పల్లి గ్రామం *సర్పంచ్ పువ్వాటి రాణి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గ్రామములో విరాళాలు సేకరించి 130000 రూపాయలతో వంట సామాగ్రి ని ప్రతి ఇంటి ఇంటికి అందించారు. ఈ సందర్బంగా సర్పంచ్ రాణి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రితం కురిసిన వానకు అన్ని కోల్పోయి తీవ్రమైన బాధని మా గ్రామ ప్రజలకు తెలుపగ అందరు సహకరించి విరాళాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ సందర్బంగా మాకు సహకరించిన మా గ్రామ ప్రజలందరికి కృతజ్ఞతలు తెలిపారు.ఇంత గొప్ప కార్యక్రమం ని నిర్వహించినందుకు మండల ప్రజలు గ్రామ ప్రజలకు అభినందనలు తెలిపారు.