మెపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్ ముదిరాజ్
పరకాల నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాలలో నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థిగా వాకిటి శ్రీహరి ముదిరాజ్ బిడ్డ గెలుపొందారని కాంగ్రెస్ ప్రభుత్వంలో కొలువు దీరడంలో ముదిరాజ్ బిడ్డకు మంత్రి పదవి ఇవ్వాలని ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్ ముదిరాజ్ తెలిపారు.వారు మాట్లాడుతూ వాకిటి శ్రీహరి ముదిరాజ్ 17,525 ఓట్ల మెజార్టీతో గెలుపొందారని, 60 లక్షల జనాభా కలిగిన ముదిరాజ్ లకు ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచారని చాలా సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారని మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ కు మంత్రి పదవి ఇవ్వాలని తెలంగాణ ముదిరాజ్ సమాజం కోరుకుంటుందని,వాకిటి శ్రీహరికి మెపా తరపున అభినందనలు తెలియజేస్తున్నామని తెలిపారు.