అక్షర సైన్యం కలం కవాతు ఆపం.
పిర్యాధులు చేయడం మీకే కాదు..మాకు తెలుసు?
కేసులపై వార్తలే కాదు…కేసులు కూడా నమోదు చేస్తాం?
అవినీతి అధికారుల బాగోతం డిల్లీ దాకా తీసుకెళ్తాం..
మీడియా మీద కేసులపై ప్రెస్కౌన్సిల్కు పిర్యాధు చేస్తాం…
రాష్ట్ర పతి దృష్టికి తీసుకెళ్తాం…
సుప్రిం కోర్టుకు విన్నవిస్తాం…
ఉద్యోగుల హక్కులు రాసేది మీడియా…
ఉద్యోగుల కష్టసుఖాలు రాసేది మీడియా…
ఉద్యోగుల ఉద్యమాలు రాసేది మీడియా….
ఆఖరుకు మీకు జీతాలందకపోతే రాసేది మీడియా…
అలాంటి మీడియాపై నిందలు మోపితే ఎలా వుంటుందో చూపిస్తాం…
ప్రతి కార్యాలయంలో ఇక్కడ అవినీతికి తావులేదు…అనే బోర్డులు పెట్టేదాకా విశ్రమించం!
మా కార్యాలయాల్లో అవినీతికి తావులేదు…ప్రజలు ఏ పని కోసమొచ్చినా ఎవరికీ రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదన్న బోర్డులు ప్రతి కార్యాలయంలో ఏర్పాటు చేసేదాకా నేటిధాత్రి అవినీతిపై పోరాటం ఆగదు. మేం మారామని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులు చెప్పుకునే వరకు వారిని వదలం…ఇది మీడియా శపధం…? సమాజం కోసం…సమాజంలో అవినీతి రూపుమాపడం కోసం నేటిధాత్రితోపాటు మీడియా అంతా కదులతున్న క్షణం. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆస్ధులు అన్యాక్రాంతమౌతున్నాయి? వాటికి కాపాడాల్సిన కొందరు ఉద్యోగులే వాటిని పప్పు బెల్లాలు చేస్తున్నారని నేటిధాత్రి చెప్పడం తప్పా? అటు ప్రభుత్వ సొమ్ము, ఇటు నేరుగా ప్రజల సొమ్ము అప్పనంగా దోచుకుంటున్న అవినీతి అధికారులను వెలుగులోకి తేవడం నేరమా? మన రాష్ట్రంలో కూడా కొన్ని లక్షల మంది నిజాయితీ ఉద్యోగులు, అధికారులున్నారు. వారిలో కొద్ది మంది అవినీతి అధికారుల మూలంగా మొత్తం వ్యవస్ధనే భ్రష్టుపట్టిపోతోంది. దయచేసి నిజాయితీ అధికారులారా? అవినీతి చేసే ఉద్యోగులకు మద్దతివ్వకండి. వారికి సానుభూతి చూపకండి? మీ లాంటి మంచి వారిని కూడా గాడిన కట్టేలాగా వ్యవహరిస్తున్న వారిని దూరం పెట్టండి? అప్పుడు గాని సమాజంలో మార్పు రాదు…నేటిధాత్రి అవినీతిపై పోరు మొదలు పెట్టింది. అక్షర యుద్ధం చేస్తోంది. నిజాయితీ యజ్ఞం మొదలుపెట్టింది. మీరూ సహకరించండి. సమాజంలో సంతోషం వెల్లివిరిసే ప్రయత్నంచేద్దాం…అవినీతి రహిత తెలంగాణ సమాజ నిర్మాణం చేపడదాం…దేశమంతా తెలంగాణ ఉద్యోగ సమాజాన్ని చూసి గర్వించేలా చేద్దాం…ఇదే నేటిధాత్రి మంగళకార్యం…!
అవినీతిని అంతం చేస్తాం…ఎన్నికల ముందు చెప్పిందే…చెప్పి…డెబ్బై ఏళ్లుగా చెబుతూనే వున్నారు. తెలంగాణ వచ్చాక కూడా చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసిఆర్ మొదటి సారి వరంగల్ వచ్చిన సందర్భంలో ఏ అధికారికి రూపాయి లంచం ఇవ్వొద్దు. ఎవరైనా అడిగితే గల్లా పట్టుకొమ్మన్నారు. నా ఫోన్ నెంబర్ ఇస్తాను…వారి సంగతి చెబుతానన్నారు. కాని రాష్ట్రంలో ఏం జరుగుతోంది. ప్రశ్నించిన రైతునే ఓ డిప్యూటీ తహిసిత్ధార్ తన కార్యాయలంలో రైతును కింద పడేసి తొక్కాడు. తన్నాడు..పైగా రైతు తన విధులకు అడ్డొచ్చాడని కేసు నమోదు చేశారు..! ప్రశ్నించమనేది మీరే…కేసులు నమోదు చేస్తుంటే చూస్తుండేది పాలకులే అయితే సామాన్యుడికి రక్షణేది…అందుకే మీడియా వున్నది. ప్రజల పక్షాన ఎప్పుడైనా నిలబడేది మీడియానే…! సమాజంలో జరిగే అసమానతలు వెలుగులోకి తెచ్చేది మీడియానే… ఉద్యోగుల్లో అవినీతి కార్యకలాపాలు బట్టబయలు చేసేది మీడియానే…అలాంటి మీడియాను కూడా అధికారులు బుల్డోజ్ చేస్తామనే స్ధాయికి ఎదిగితే ఇక ప్రజలకు దిక్కెవరు. ప్రజా ప్రతినిధులు పట్టించుకోరు..నాయకులు ప్రజలకు న్యాయం చేయరు. ఇలాంటి సమయంలో అధికారులు తమ ఇష్టారాజ్యం చేసుకుంటారు..అందిన కాడికి దోచుకుతింటారు…పేదలను కూడా వేధించుకుతింటారు..! ఇవన్నీ మన కళ్లముందు కనిపిస్తున్న నిజాలే..సాక్ష్యాలే ఇంకే కావాలి? కాని ప్రభుత్వానికి తీరిక లేదు. అధికారులకు అడ్డూ అదుపు లేదు….కొందరు అధికారులు అడ్డదిడ్డంగా సంపాదించుకుంటున్నారు. అదేమిటని ప్రశ్నించినందుకు మీడియా మీద కేసులు నమోదు చేస్తామన్నంత భరితెగింపుకు దిగజారుతున్నారు. ఇక మీడియా ఉపేక్షిస్తుందనుకుంటే పొరపాటు…
నరనరాన సామాజిక సేవను, బాధ్యతను, సృహను నింపుకున్న ఏకైక సమాజం మీడియా…ఇది తెలిసి కూడా మీడియా మీద పడిపోతాం..బుల్డోజ్ చేస్తాం…నిందలేస్తాం…అంటే నిప్పుకణికల్లాంటి మీడియాను ముట్టుకుంటే కాలేది ఉద్యోగులకే…! తెలంగాణ ఉద్యమం కాలంతోపాటు, ఇప్పటికీ ఎలాంటి లాభాపేక్ష లేని ఏకైక సమాజం మీడియా…జర్నలిస్టులు…తెలంగాణ ఉద్యమానికి అక్షర భీజాలు వేసింది జర్నలిస్టులు..అడుగుగడుగునా వినిపించిన తెలంగాణ గళాన్ని అక్షరబద్దం చేసింది జర్నలిస్టులు…మారు మూల ప్రాంతాలకు కూడా ఆ పదం వేదమయ్యేలా ప్రచురించి అక్షర యజ్ఞం చేసింది జర్నలిస్టులు..ఒక్క మాటలో చెప్పాలంటే జర్నలిస్టులే నిజమైన ఉద్యమకారులు. తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసిన స్వాతంత్య్ర సమరయోధులు…అని చెప్పక తప్పదు. ఉద్యమ కాలంలో ఉద్యోగాలను కూడా తృణ ప్రాయంగా వదులుకున్నది జర్నలిస్టులు…కాని కొలువులు వదులుకున్న ఒక్క ఉద్యోగిని చూపించండి. మీ జీతాల గురించి రాయాలన్నా జర్నలిస్టులే కావాలి. మీ హక్కుల సాధనను కవర్ చేయాలన్నా కావాల్సింది జర్నలిస్టులే…నెల నాడు జీతాలు రాకపోతే పస్తులుంటున్న ఉద్యోగులు అని అక్షరాలు రాయాల్సింది జర్నలిస్టులే…మీ హక్కులను గుర్తు చేసేది జర్నలిస్టులే…మీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తెచ్చేది జర్నలిస్టులే..!ఆఖరకు మీకు కొలువు విషయంలో వ్యక్తిగతమైన సమస్యలపై మొర పెట్టుకోవాలన్నా కావాల్సింది జర్నలిస్టులే…మీడియా లేకుండా ఒక్క క్షణం గడవదు…అలాంటి మీడియా మీరు తప్పులు చేయకండి…అవినీతికి పాల్పడకండి అని చెబితే నచ్చదా? మీరు ఒత్తిళ్లు ఎదుర్కొన్నప్పుడు మీడియా కావాలి…కాని మీ తప్పులను ఎత్తి చూపకూడదా? ఇదెక్కడి న్యాయం? అయినా మీడియాకు తన, మన అన్న తేడా వుండదు? తప్పు చేసేవారిని ఎత్తి చూపడం..మంచి చేసే వారిని ప్రపంచానికి పరిచయం చేయడమే మీడియాకు తెలుసు…తెగువ తప్ప ఏ తెగులు అంటనిదే మీడియా….
ఓ వైపు చేయాల్సినంత తప్పుడు పనులు చేసుకుంటూనే మా అంత మంచి వాళ్లు లేరని అవినీతి ఉద్యోగులు ప్రచారం చేసుకుంటే…సరిపోతుందా? అబద్దం నిజమౌతుందా? చేసిన తప్పులు మాసిపోతాయా? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మరింత అంకితభావంతో పనిచేయాల్సిన బాధ్యతను కొంత మంది అవినీతి అధికారులు విస్మరించారు. పేట్రేగిపోతున్నారు. తెలంగాణ వచ్చాక బాగుపడిన సమాజం ఏదైనా వుందంటే అది ఉద్యోగులే…జీతాలు పెరిగాయి…ప్రమోషన్లు వచ్చాయి. ఇంకే కావాలి. ఇంకా ఇంకా కావాలనుకుంటే ప్రభుత్వంతో కొట్లాడి జీతాల పెంచుకోండి. జనం రక్తం తాగాలన్నంత కక్కుర్తి ఎందుకు? శవాల మీద పేలాలు ఏరుకోవడం ఎందుకు? పేదల కడుపు కొట్టకండి? పేదల రక్తం తాగకండి?..ప్రతి పనికి ఓ రేటు అంటూ వేధించడం మానుకోండి…ఇదే కథా! నేటిధాత్రి చెబుతోంది…అది మాత్రం మా వల్ల కాదనుకునే కొందరు ఉద్యోగుల మూలంగానే మొత్తం వ్యవస్ధకు చీడ తగులుతోంది. అధికారి అంటే ఒక రకమైన భావన సమాజంలో ఎందుకు ఏర్పడిరది. అది ఉద్యోగ వ్యవస్ధకే మచ్చ కాదా? అందుకే ఆ మచ్చ తుడిపేయాలంటే మీడియాకు సహకరించండి! అయినా మేం మారం అంటే…మీకున్న మార్గాలు మీకుంటే…మాకున్న మార్గలు మాకున్నాయి? ప్రెస్ కౌన్సిల్లో పిర్యాధు చేస్తాం…రాష్ట్రపతిని కలిసి వివరిస్తాం…సుప్రింకోర్టును ఆశ్రయిస్తాం…అవినీతి అధికారుల భరతం పడతాం…! ఇది సూచన ప్రాయంగానే చెబుతున్నాం…హెచ్చరికగా మారేదాకా చూడకండి!! మార్పు కోసం ప్రయత్నించండి…మార్పు అన్నది ఒక్కరితోనే మొదలౌతుంది! ఒక్క కార్యాలయంలో మా కార్యాలయం దేవాలయం అని రాసిపెట్టండి!! చాలు అవినీతి అగిపోతుంది..! ఒక ప్రయత్నం చేయండి!! వ్యవస్ధలో మార్పు ఎందుకు రాదో చూద్దాం…అవినీతి ఎందుకు అంతం కాదో పంతం పడదాం..దాని అంతు చూద్దాం!!!