చందుర్తి, నేటిధాత్రి:
సోమవారం రోజున చందుర్తి మండల కేంద్రంలో గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు సిడిపి నిధుల నుండి చందుర్తి మాదిగ సంఘానికి మూడు లక్షల రూపాయలు మంజూరు కాగా మట్టి పనులకు ఈరోజు భూమి పూజ చేయడం జరిగినది ఈ సందర్భంగా సంఘ సభ్యులు నిధులు మంజూరు చేసినందుకు గౌరవ శాసనసభ్యులకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు తిప్పని శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాసరావు, కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, నాయకులు పులి సత్యం, సిరికొండ శ్రీనివాస్, ఉప సర్పంచ్ శిర్రం తిరుపతి, ఎస్సీ మాదిగ సంఘం అధ్యక్షులు లింగంపల్లి వెంకటి, లింగంపల్లి రాజయ్య, సిరికొండ మల్లయ్య, వార్డు సభ్యులు పిట్టల బాబు, రాగుల సాగర్ సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మాదిగ సంఘానికి సిడిపి నిధుల మంజూరు
