కేసముద్రం(మహబూబాబాద్),నేటిధాత్రి:
కేసముద్రం మండలంలోని అర్పనపల్లి గ్రామ శివారులోని మన్నెకుంట చెరువు శిఖరము కబ్జా గురి అయిందని అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకుడు జిల్లా కలెక్టర్ కు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేయగా స్పందించిన రెవిన్యూ,ఇరిగేషన్,గనులు భూగర్భ శాఖ,రెవిన్యూ డివిజన్ అధికారల సమక్షంలో సంయుక్తంగా ఎంజాయ్మెంట్ సర్వే లో భాగంగా సంభందిత అధికారులు మన్నెకుంట చెరువు,సద్గురు స్టోన్ క్రషర్ మిల్లు పై జాయింట్ సర్వే నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పిర్యాదు చేసిన యువకుడు మాట్లాడుతూ చర్యలను అధికారులు వేగవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డి ఈ కుమారస్వామి,ఏఈ సాయి తేజ, మైనింగ్ ఏజీ రవీందర్,మైనింగ్ ఆర్ ఐ నరేష్,మైనింగ్ సర్వేయర్ వెంకటేశ్వర్లు,కేసముద్రం తాసిల్దార్ నరేష్,ఆర్ఐ బాబు పాల్గొన్నారు.