మంత్రి కేటీఆర్ ను కలిసిన ఎమ్మెల్యే అరూరి

బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి&పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారిని బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వరంగల్ నగరంలో ఇటీవల కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయని మంత్రి గారికి వివరించారు. ముఖ్యంగా వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోని విలీన గ్రామాలు, అనేక కాలనీలలో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వరద నీటితో రోడ్లు, డ్రైన్లు దెబ్బతిన్నాయని వాటి మారమ్మతులకు నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్ గారిని కోరారు. అలాగే నూతనంగా ఏర్పడిన వర్దన్నపేట మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్ గారు త్వరలోనే అవసరమైన నిధులను మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *