బోయినిపల్లి-కొదురుపాక బ్రిడ్డిని హైలెవల్ చేయాలి

చొప్పదండి కాంగ్రెస్ ఇంచార్జ్ మేడిపల్లి సత్యం

బోయినిపల్లి,నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా
బోయినిపల్లి-కొదురుపాక బ్రిడ్డిని హైలెవల్ చేయాలని
చొప్పదండి కాంగ్రెస్ ఇంచార్జ్ మేడిపల్లి సత్యం అన్నారు. గురువారం
మండల కేంద్రంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా బోయినిపల్లి నుండి కొదురుపాక కు వెళ్ళే రోడ్డు మార్గంలో అసౌకర్యంగా ఉన్న లోలెవల్ బ్రిడ్డిని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేడిపల్లి సత్యం పరిశీలించారు. ఈ సందర్బంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ
వర్షాలు కురిసినప్పుడు బోయినిపల్లి మండల కేంద్రనికి, జిల్లా కేంద్రానికి వెళ్ళాలి అంటే ప్రజలు
ఇబ్బందులు పడాల్సివస్తుందన్నారు. బడికి వెళ్లే పిల్లలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందన్నారు.
బోయినపల్లి మండలంలో ఉన్న తొమ్మిది లో లెవెల్ బ్రిడ్జి లను హై లెవెల్ చేయాలని డిమాండ్ చేశారు. వరదలతో ఇసుక కొట్టుకు వచ్చి పంట పొలాల్లో ఇసుక మెట్ట పెట్టటం జరిగిందని, కావున రైతులను ప్రభుత్వం ఆదుకోని పంట నష్ట పరిహారం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బోయినపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు వన్నెల రమణ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యులు పులి లక్ష్మిపతి గౌడ్, తడగొండ ఎంపీటీసీ ఉయ్యాలా శ్రీనివాస్ గౌడ్, మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగుల కనుకయ్య, మండల కాంగ్రెస్ నాయకులు బోయిని ఎల్లేష్, ఎండీ బాబు,గుడి శేఖర్ రెడ్డి ,సాన సత్యం ,ఎండీ హుస్సేన్,పెండ్యాల శ్రీనివాస్ రెడ్డి, గంగి పెల్లి లచ్చయ్య, ఎండీ రఫీ, సాగరం కనుకయ్య, లాల్ కనుకయ్య,నర్సింహా రెడ్డి మరియు యువజన కాంగ్రెస్ నాయకులు నాగుల వంశీ, నిమ్మ వినోద్ రెడ్డి, ఆకుల అజయ్, నక్క శ్రీకాంత్,నేరెళ్ల పర్శరాం మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!