బీజేపీ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో చేపట్టిన పెసరు విజయచెందర్ రెడ్డి పోలీసులు నాయకుల మధ్య తోపులాట

పరకాల నేటిధాత్రి
బిజెపి రాష్ట్ర శాఖ పిలుపుమేరకు తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా టిఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఇచ్చిన హామీలను సంక్షేమ పథకాలను అర్హులైన అన్ని వర్గాలకు ప్రజలకు అందించడంలో వైఫల్యం చెందిదని బిజెపి పార్టీ పరకాల నియోజకవర్గం ఆధ్వర్యంలో గీసుకొండ క్రాస్ వద్ద రాస్తారోకో కార్యక్రమంలో చేపట్టారు.పోలీసులకు బిజెపి నాయకులకు తోపులాటలతో వాగ్వాదంతో కార్యక్రమ ప్రాంతం రణరంగంగా మారింది.ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ విజయ చందర్ రెడ్డి మాట్లాడుతూ
ప్రజల మద్దతుతో రాస్తారోకో చేసుకుంటున్న బిజెపి నాయకులపై పోలీసుల చర్యలు ప్రజలు కూడా ఖండిస్తున్నారని అన్నారు.
మొత్తానికి బిజెపి రాస్తారోకోకు ప్రజా మద్దతు అధికంగా లభించిందని ఇది టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిస్తోందని రానున్నది బిజెపి ప్రభుత్వ మే అని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుజ్జ నారాయణరావు,కాచం గురు ప్రసాద్,పరకాల కౌన్సిలర్లు దేవనూరు మేఘనాథ్, కొలనుపాక భద్రయ్య, కైరిక రవికుమార్, ముత్యాల శ్రీనివాస్, బాసాని సోమరాజ్, మూల్క ప్రసాద్, రతన్ కుమార్, మండల అధ్యక్షులు నిమ్మగడ్డ జాన్ విక్రమ్, బుట్టి కుమారస్వామి, పుట్ట రవీందర్, ఈర్సట్ల సదానందం, జంగిలి నాగరాజ్,డివిజన్ అధ్యక్షులు గోదాసి అశ్విన్ కుమార్, బిల్లా రమేష్, ఇదగాని నవీన్ కుమార్, కార్యాలయ కార్యదర్శి కంది క్రాంతి కుమార్, జిల్లా కోశాధికారి పగడాల రాజకుమార్,
యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అరకట్ల ప్రవీణ్, బూర్గుల యుగేందర్, కత్తి రమేష్, మరిపూడి శ్రీనివాస్, గడ్డమీద బాలరాజు, మరిప్పుడు రోశయ్య, డాక్టర్ రాజిరెడ్డి, దివాకర్ ,దేవరాజ్ ,
గీసుకొండ, సంగెం,15,16,17 వ నడికూడా ,పరకాల,దామెర,ఆత్మకూర్ మండలాల డివిజన్ ల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!