బిసిల అడ్డ…మునుగోడు గడ్డ!

`మునుగోడు లో బిసిలకు కలిసొచ్చే కాలమే!

` పార్టీలన్నింటి చూపు బిసిల వైపే…

`పార్టీ లన్నీ బిసిల కోసం వెతుకులాటే!

` రెడ్డి లీడర్లది పలాయనమే!

` మరో నియోజకవర్గం వెతుక్కోవడమే!

` బిఆర్‌ఎస్‌ బిసిలకు గాలమందుకే!

`కాంగ్రెస్‌ రెడ్డి ల విషయంలో అంతంత మాత్రమే…

`మునుగోడు లో రేవంత్‌ రెడ్డి అనుచరుడైన ఆ బిసికే..

`రాజగోపాల్‌ రెడ్డి దూరం.. దూరమే!!

` మునుగోడు లో బిజేపి గెలవడం కష్టమే?

` బిజేపి కూడా బిసి నాయకుడి వేటలోనే!

` కాంగ్రెస్‌ కూడా అదే బాటలోనే…

`రాజగోపాల్‌ రెడ్డి కమలం వదిలి కాంగ్రెస్‌ స్నేహ హస్తమే…

` ఎల్‌ బి. నగర్‌, భువనగిరి కోరుతున్నది నిజమే?

` గేర్‌ మార్చింది కొత్త దారి కోసమే?

`మునుగోడు లో పెరుగుతున్న బిసి నేతల హవా!

` బలమైన బిసి నేతలకు పార్టీల వల.

`మొదటి నుంచి నేటిధాత్రి చెబుతున్నదిదే!

`మునుగోడు లో నిజమౌతున్నది అందుకే

హైదరబాద్‌,నేటిధాత్రి: 

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మునుగోడు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటీవల ఉప ఎన్నికల జరగడమే అందుకు కారణం. తెలంగాణ రాష్ట్రం లో జరిగిన ఉప ఎన్నికల నియోజకవర్గాలలో మునుగోడు ప్రత్యేకతను సంతరించుకున్నది. అక్కడి నుంచి 2018లో జరిగిన ముందస్తు ఎన్నికలలో అప్పటి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి అనూహ్యంగా అపజయం పాలయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థి అయిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి విజయం సాధించారు. ఎన్నికలలో గెలిచినా వెంకటరెడ్డి కాంగ్రెస్‌ రాజకీయాలపై ఆసక్తి కనబర్చలేదు. అడుగడుగునా కోమటి రెడ్డి బ్రదర్స్‌ కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ రాజకీయాలు సాగుతూవచ్చాయి. గత కొన్ని సంవత్సరాలుగా తదుపరి పిసిసి. నేనే అన్న భ్రమలో వున్న అన్న వెంకటరెడ్డి కి కాంగ్రెస్‌ పార్టీ షాక్‌ ఇచ్చింది. గత ముందస్తు ఎన్నికలలో వెంకటరెడ్డి నల్గొండ నుంచి ఓటమిపాలయ్యారు. అది ఆయనకు పెద్ద మైనస్‌ అయ్యింది. తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికలలో టిక్కెట్‌ తెచ్చుకొని గెలిచినా వెంకటరెడ్డి ఆశలు తీరలేదు. అనూహ్యంగా పిసిసి. అధ్యక్షుడుగా రేవంత్‌ రెడ్డి రావడం, కోమటి రెడ్డి సోదరులకు నచ్చలేదు. దాంతో అన్నదమ్ములు ఇద్దరూ బిజేపి వైపు చూశారు. కాంగ్రెస్‌ పార్టీ మీద అనేక విమర్శకులు కూడా చేశారు. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అనే కాంగ్రెస్‌ లో కోమటి రెడ్డి సోదరులు ఏం చేసినా చెల్లింది. అయినా వారి అసంతృప్తి ఆగలేదు. తమ్ముడు రాజగోపాల్‌ రెడ్డి బిజేపి బాటపట్టారు. కాంగ్రెస్‌ కు హాండిచ్చారు. దాంతో రాజీనామా చేసి తన పవర్‌ చూపించుకుందామని, రాజగోపాల్‌ రెడ్డి ఉన్న పవర్‌ పోగొట్టుకున్నాడు. ఉప ఎన్నికలలు రానే వచ్చాయి. మునుగోడు మీద అన్ని పార్టీలు ఫోకస్‌ చేశాయి. రాజీనామా చేసి బిజేపి లో చేరిన రాజగోపాల్‌ రెడ్డి ని ఎదుర్కొనేందుకు మునుగోడు నుంచి అనేక మంది బిసి. నాయకులు ముందుకొచ్చారు. సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోయిన కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి కి టిక్కెట్‌ ఇవ్వడం బిఆర్‌ఎస్‌ శ్రేణులకు సుతారం ఇష్టం లేదు. తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపరుస్తూ వచ్చారు. కాకపోతే ముఖ్యమంత్రి కేసిఆర్‌ తీసుకున్న నిర్ణయాన్ని శిరసావహించి నేతలంతా కలిసి మునుగోడు లో కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి ని ఉప ఎన్నికలలో గెలిపించారు. 

ఇక్కడితో అసలు కథ మొదలైంది. ఆ ఎన్నికలలో తీవ్ర ప్రభావం చూపే ఓట్ల శాతం ఎవరివి? నాయకులు ఎవరు? 

అన్న విషయాలు తెరమీదకు వచ్చాయి. పట్టుమని పది శాతం కూడా లేని రెడ్డి సామాజిక వర్గం ఇంత కాలం పెత్తనం చేస్తూ వస్తోంది. ఇక వారి ప్రాతినిధ్యాన్ని తగ్గించాలంటే అత్యధిక సంఖ్యలో వున్న బిసిలు ఎన్నికలలో పోటీకి ముందు రావాలన్న బలమైన కోరిక వెలుగులోకి వచ్చింది. అది ఇప్పుడు రానున్న ఎన్నికలలో తీవ్ర ప్రభావం చూపనున్నది. మునుగోడు లో బిసిలకు కలిసొచ్చే కాలమే! అన్నది కనిపిస్తోంది. 

ఒక్క సారిగా మునుగోడు లో పార్టీలన్నీ బిసిల వైపు చూస్తున్నాయి. 

ముఖ్యంగా బిఆర్‌ఎస్‌ నుంచి బిసిలలో బలమైన సామాజిక వర్గం ముదిరాజ్‌ కు చెందిన నారబోయిన రవి పేరు బాగా వినిపిస్తోంది. గత కొంత కాలంగా డి.ప్యాక్‌ తో కలిసి, నేటిధాత్రి చేపట్టిన సర్వే వివరాలు కూడా వెల్లడిరచడం జరిగింది. ఎమ్మెల్యే కూసుకుంట్లపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఆ విషయమే నేటిధాత్రి చెబుతూ వస్తోంది. అంతే కాకుండా ఎమ్మెల్యే కూసుకుంట్ల పై మునుగోడు లో ఎదురౌతున్న వ్యతిరేకత ఆయన కు కూడా తెలుసు. ఈసారి పార్టీ టికెట్‌ ఇచ్చినా గెలిచే పరిస్థితులో లేనని కూడా కూసుకుంట్ల కు తెలుసు. మునుగోడు లో బిఆర్‌ఎస్‌ మళ్ళీ గెలవాలంటే, బిఆర్‌ఎస్‌ ఖాతాలోనే మునుగోడు వుండాలంటే కూసుకుంట్ల పక్కకు తప్పుకోవాలని కూడా తెలుసు. అటు ప్రజలు, పార్టీ శ్రేణులు కూడా మార్పు కోరుకుంటున్నారు. మునుగోడు లో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు ఎంతో దగ్గరౌతున్న రవి నారబోయిన రవికి టికెట్‌ ఇవ్వాలన్న డిమాండ్‌ కూడా క్రమంగా పెరుతూవస్తోంది. ఇదే నేటిధాత్రి కూడా చెప్పింది. దాంతో కూసుకుంట్ల చేతులెత్తేసినట్లే అనే ప్రచారం కూడా జోరందుకున్నది. పార్టీ ఎవరికి టికెట్‌ ఇచ్చినా అందరం కలిసి పని చేయాల్సిందే..పార్టీని గెలిపించాల్సిందే అనే మాట ఎమ్మెల్యే కూసుకుంట్ల నుంచి కూడా వచ్చినట్లు తెలుస్తోంది. అంటే ఈసారి టికెట్‌ నారబోయిన రవి కే దక్కుతుందని కూసుకుంట్ల కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అందుకే రవికి అనుకూలంగా కూసుకుంట్ల ఈ వ్యాఖ్య చేసి వుంటాడని నియోజకవర్గం మొత్తం చెప్పుకుంటోంది. అంటే కూసుకుంట్ల తప్పుకున్న నేపథ్యం ముందే తెలియడంతో శ్రేణులన్నీ మళ్ళీ ఒక్కతాటి మీద కు వచ్చి బిఆర్‌ఎస్‌ గెలిపించే యోచన కు కసరత్తు మొదలైందనే అంటున్నారు. ఇప్పటికే నారబోయిన రవి ని అభినందనలు కూడా తెలుపున్నట్లు చెబుతున్నారు. మునుగోడు విషయంలో బిఆర్‌ఎస్‌ ఈసారి బిసి మంత్రం జపించే అవకాశం వుందని తెలియడంతో బిజేపి, కాంగ్రెస్‌ లు డైలమాలో పడ్డట్టు సమాచారం. 

దాంతో మునుగోడులో పార్టీ లన్నీ బిసిల కోసం వెతుకులాట ప్రారంభించినట్లు తెలుస్తోంది.

 మునుగోడు లో ఇప్పటి దాకా ఏలిన రెడ్డి లీడర్లకు ఒక్కసారిగా కుదుపు కనిపిస్తోంది. అందుకే రాజగోపాల్‌ రెడ్డి మునుగోడు నుంచి పలాయనం చిత్తగించున్నారన్న ప్రచారం మొదలైంది. మరో నియోజకవర్గం వెతుక్కోవడమే! తాజాగా వినిపిస్తున్న ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం రాజగోపాల్‌ రెడ్డి కమలం వదిలి మళ్ళీ హస్తం గూటికి చేరుకునే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు విసృత ప్రచారం సాగుతోంది. ఒకవేళ రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నా అక్కడ ఆయన కు అవకాశం ఇవ్వదు. అందుకే ముందుగానే పక్క నియోజకవర్గం ఎల్‌ బినగర్‌ కానీ, భవనగిరి ఇవ్వాలని పార్టీని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉప ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత మునుగోడు లో బిఆర్‌ఎస్‌ ను ఓడిరచి తీరుతా? అని శపథం చేసిన రాజగోపాల్‌ రెడ్డి కి దేశ రాజకీయాలలో వస్తున్న మార్పులు కళ్లు తెరిపించినట్లున్నాయి. అందుకే మళ్ళీ హస్తానికి దగ్గరౌతున్నారు. కానీ మునుగోడు కోరుకోవాలనుకోలేదు. పార్టీ మారి మళ్లీ టికెట్‌ తెచ్చుకుని ఎంత ఖర్చు చేసినా గెలవడం కష్టమని తెలిసే రాజగోపాల్‌ రెడ్డి దూరం జరుగుతున్నాడు. దాంతో కాంగ్రెస్‌ కూడా బిసి నాయకుడిని వెతికే పనిలో పడినట్లు సమాచారం. పిసిసి. అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కి సన్నిహితుడైన ఓ బిసి నేతకు టికెట్‌ ఇస్తే ఎలా వుంటుంది? అన్నదానిపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది. బిజేపి లో చేరి జెళ్లకొట్డిన రాజగోపాల్‌ రెడ్డి స్థానంలో బిజేపి కి బలమైన రెడ్డి సామాజిక వర్గ నేత మునుగోడు లో లేడు. కానీ బిసి నాయకులు వున్నారు. అందులో బిఆర్‌ఎస్‌ నుంచి బిజేపి లో చేరిన భువనగిరి మాజీ ఎంపి. బూర నర్సయ్య గౌడ్‌ ను బరిలో నిలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా మునుగోడు రాజకీయాలు అటు తిరిగి ఇటు తిరిగి నారబోయిన రవి చుట్టే తిరుగుతున్నాయని ప్రచారం సాగుతోంది. గతంలో ఆయన కాంగ్రెస్‌ పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకుడుగా పని చేసిన అనుభవం వుంది. మరో వైపు ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలన మీద ఎంతో సంతృప్తి వుండి, బంగారు తెలంగాణ వైపు నిలబడాలనుకున్నారు. తెలంగాణ సాధించిన తర్వాత కొన్ని తొలి ఫలితాలు మునుగోడు కు అందడం తో ఆయన బిఆర్‌ఎస్‌ వైపు ఆకర్షితులయ్యారు. తాను కూడా ప్రజలకు మరింత సేవ చేయాలనే లక్ష్యంతో కొన్ని వ్యాపారాలను వ్యాపకాలను కూడా పక్కన పెట్టి, ప్రజా సేవలో నారబోయిన రవి నిమగ్నమయ్యారు. ప్రజలకు సేవ చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో వుంటున్నారు. ప్రజల మధ్య నిత్యం గడుపుతున్నారు. ఇటీవల వ్యాపారాలు కూడా పూర్తిగా పక్కనపెట్టి రాజకీయాల మీదనే దృష్టి పెట్టారు. మంత్రి జగదీష్‌ రెడ్డి ఆశీస్సులు మెండుగా వుండడం, బలమైన బిసి సామాజిక వర్గం నారబోయిన రవి కి కలిసొచ్చే అంశాలుగా మారాయి. పార్టీ లన్నీ రవి మూలంగా బిసిల వైపు చూసేలా చేశాయి.

 ఇదే విషయాన్ని నేటిధాత్రి గత కొంత కాలంగా చెబుతూ వస్తోంది. మునుగోడే రాష్ట్ర రాజకీయాలలో మార్పుకు నాంది పలికే అవకాశం కల్పిస్తోంది. ఇప్పటి వరకు సాగిన రెడ్డి ల ఆధిపత్యానికి మునుగోడు లో గండి పడనుంది. ఒక్క అడుగుతో నియోజకవర్గం రాజకీయాలనే మార్చిన రవి రాక, ప్రజల ఆదరణ, ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆశీస్సులతో మునుగోడును బిసి ల అడ్డాగా మారడానికి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *