పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించాలి
ఏ పీ ఆర్ ఆదర్శ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రెటరీ కే.వెంకటా చారి
మంగపేట, నేటిధాత్రి
మంగపేట మండలంలోని కమలాపురంలో బిల్ట్ కార్మికులు ఫ్యాక్టరీ మెయిన్ గేటు ముందు అర్థ నగ్నంగా నిరసన వ్యక్తం చేశారు తనకు రావలసిన బకాయిలు
పెండింగ్ జీతాలు,
పెండింగ్ (పి యఫ్ )లు,
గ్రాడ్యూటీ చట్ట ప్రకారం చెల్లించాలి అని ఏపీ ఆర్
ఆదర్శ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రెటరీ కే.వెంకటా చారి అన్నారు.
ఎల్ ఐ సి డబ్బులు రికవరీ చేసినవి, బెనివలఫ్ పండ్ బ్యాంకులో నుండి తీసి కార్మికులకు ఇవ్వాలని,రిటైర్ కానీ కార్మికులను నూతన యాజమాన్యం విధులకు తీసుకోవలని,
6.0 కోట్లు ఇచ్చి అనుజైన్ దగ్గర ఉన్న
69 కోట్ల తో కార్మికుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాము అని అన్నారు
ప్రభుత్వం 350 కోట్లు ఇస్తానని చెప్పినది కావున ఆ డబ్బుల
నుండి కొంత డబ్బు కార్మికుల కుటుంబాలకు ఇచ్చి ఆదుకో వాలని వేడుకొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏపీ ఆర్
ఆదర్శ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రెటరీ కే.వెంకటా చారి,విజయ రావు,ఎన్ రాజయ్య,పి భాస్కర్ రావు
మార్కండేయ,బి వెంకట నారాయణ,
సిహెచ్ శ్రీనివాస్,ఏ . వెంకటేశ్వర రావు,
బి ముత్తయ్య,కౌసల్య, చిలకమ్మ,ఆనంద రావు,
వెంకట రావు,నజీర్,సారంగం అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.