బస్తి బాటతో సమస్యలు పరిష్కారం.

బస్తి బాటతో సమస్యలు పరిష్కారం.
.. రెవిన్యూ డివిజన్ డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని సీఎం కోరుతాం.

.. రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్.
రామాయంపేట (మెదక్)నేటి ధాత్రి.
రామాయంపేట పట్టణంలో చేపట్టిన బస్తిబాట కార్యక్రమం వల్ల చాలా సమస్యలు పరిష్కారమైనట్లు మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ తెలిపారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని 11 వ వార్డులో రెండో విడత బస్తిబాట కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా వార్డులో సాధ్యమైనంతవరకు సమస్యలు బస్తిబాట ద్వారా పరిష్కరించుకోవడం జరిగిందన్నారు. పెద్దపెద్ద సమస్యలు ఉంటే దశలవారీగా పరిష్కరించుకోవడానికి కృషి చేస్తున్నట్లుగానే తెలిపారు. ఇప్పటికే 10 కోట్లతో మున్సిపాలిటీ అభివృద్ధి చేయడం జరిగిందని పలు అభివృద్ధి పనులు చేస్తామన్నారు. ఈనెల 19వ తేదీన మెదక్ వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను రామాయంపేట రెవిన్యూ డివిజన్ తో పాటు డిగ్రీ కళాశాల మరియు మున్సిపల్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరనున్నట్లు తెలిపారు. బస్తి బాట కార్యక్రమం రూపకల్పన సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, కమిషనర్ , కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *