ఫొర్జరీకి సబ్‌ రిజిస్ట్రార్‌ అధికారిక రిజిస్ట్రేషన్‌

విచారణలో నమ్మలేని నిజాలు

సంతకం స్కాన్‌ చేసి ఇచ్చినా గుర్తించలేని స్థితిలో సబ్‌ రిజిస్ట్రార్‌

ఓనర్‌షిప్‌ డాక్యుమెంట్‌ ఫోర్జరి ఐనట్లు గుర్తించిన అధికారులు

బోచ్చు సుజాత,సమ్మయ్యకు ఓనర్‌షిప్‌ ఇవ్వలే… సృష్టించారు

నిజంగా నకిలీ స్టాంపులు ఆ కార్యలయంలో ఉన్నాయా..?

సెక్రటరీ పాత సంతకాన్ని స్కాన్‌ చేసి నకిలీ దృవీకరణలు

రిజిస్ట్రేషన్‌ నకిలీని గుర్తించే చేసారా లేక గుర్తించలేదా..?

గుర్తించపోతే ఫోర్జరీ చేసి ఏది తెచ్చినా రిజిస్ట్రేషన్‌ చేసేస్తారా..?

ప్రభుత్వ భూమా లేక కోనుగోలు చేసిందా తేల్చడంలో అధికారుల నిర్లక్ష్యం

ఇంటి నంబర్‌ తెచ్చుకుంటే చాలు భూమేదైనా రిజిస్ట్రేషన్‌…?

ములుగులో ఇలాంటి అక్రమాలెన్నో ఉన్నాయనే అరోపణలు

విచారణ చేస్తే అక్రమాలు వెలుగులోకి వచ్చిన పచ్చి నిజాలు

బోచ్చు సమ్మయ్య , సుజాతలు విచారణకు హాజరు కాలేదు : ఎంపివో హన్మంతరావు

బ్యూరో నేటిధాత్రి : ములుగు

ఇలాఖాల్లో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం కేంద్రంగా జరుగుతున్న అక్రమాలపై నేటిధాత్రి గత కొంతకాలంగా నిర్విరామంగా అక్షర పోరాటం చేస్తున్నది. అధికారుల అక్రమాల వలన రోడ్డున పడ్డ బాధితులు నేటిధాత్రి కార్యాలయానికి క్యూ కడుతున్న క్రమంలో పలు కథనాలను ప్రచురిస్తూ వచ్చింది. ఈ కథనాలపై అక్రమ అధికారులకు సంబంధించిన అనుచరులు అనేక ఆరోపణలు నిందలు వేసి నేటిధాత్రిని ఇబ్బందులకు గురి చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేశారు. అంతేకాదు ఎంగిలి మెతుకులకు ఆశపడే కొన్ని సంఘాల నాయకులను అద్దెకు తీసుకు వచ్చి చిల్లర ప్రకటనలు ఇప్పించి రాక్షసానందం పొందారు. అయినా నేటిధాత్రి అడుగు వెనక్కి ముందు

నుండి చెప్పిన మాట తప్పలేదు , మడమ తిప్పలేదు. ఇప్పటికి ఆ కార్యలయం కేంద్రంగా వందల , వేల కోట్ల అక్రమాలు జరిగాయని స్థానికంగా వస్తున్న సమాచారం ప్రకారంగా ఇంకా లోతుగా మా ప్రత్యేకమైన విధానంలో విచారణ సాగిస్తూనే ఉన్నాం.

రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఉన్న కొందరు అక్రమ అధికారుల ధనదాహాన్ని ఆసరాగా చేసుకుని ఎంతమంది వ్యక్తులు ఎన్ని చోట్లు ఎన్ని వందల ఎకరాల భూములు లాక్కున్నారో ఆ చిట్టా అంతా సేకరించేందుకు ఏ మాత్రం బెరుకు లేకుండా ముందుకే వెళుతున్నాం. ఈ క్రమంలో గత కొన్ని రోజుల క్రితం ములుగు బండారుపల్లి గ్రామానికి చెందిన బోచ్చు సమ్మయ్య , బోచ్చు సుజాతల పేర ములుగు సబ్‌ రిజిస్ట్రార్‌ చేసిన భూమి ప్రభుత్వ భూమని దీనికి ఎలాంటి అనుమతులు , హక్కులు లేకున్నా అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసి అక్రమాలకు పాల్పడినట్లు వస్తున్న వార్తలను నేటిధాత్రి ప్రచురించింది. దీనికి సంబంధించి సబ్‌ రిజిస్ట్రార్‌ ఆన్‌లైన్‌ ఆసెస్‌మెంట్‌ , ఓనర్‌షిప్‌ సర్టిఫికేట్‌ సహా అన్ని అర్హత పత్రాలు పరిశీలించాకే రిజిస్ట్రేషన్‌ చేసినట్లు ప్రకటించారు. అయితే ఈ అంశంపై వార్తలు వచ్చిన క్రమంలో సంబంధిత మండల పంచాయితీ అధికారి శనివారం బండారుపల్లి గ్రామాన్ని సందర్శించి అక్కడ రిజిస్టర్‌లు , సంబంధిత ల్యాండ్‌కు సంబంధించిన వివరాలను గురించి స్థానిక పంచాయితీ కార్యదర్శి సహా ఇతర సిబ్బందితో కలిసి చేసిన విచారణలో బోచ్చు సమ్మయ్య, బోచ్చు సుజాతలకు ఎలాంటి ఓనర్‌షిప్‌ సర్టిఫికేట్‌ గాని , ఆన్‌లైన్‌ ఆసెస్‌మెంట్‌గాని జారీ చేసినట్లు రికార్డుల్లో లేదని నిగ్గు తేల్చారు. ఆంతేకాకుండా ఈ విచారణ వివరాలతో కూడిన రిపోర్టును ఆయన ఎంపిడివోకు తద్వారా ఆర్డీవోకు అందించనున్నట్లు తెలిసింది. 

సంతకం స్కాన్‌ చేసి ఇచ్చినా గుర్తించలేని స్థితిలో సబ్‌ రిజిస్ట్రార్‌ 

ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఏదైనా చిన్న పని కావాలంటే ఎన్ని కాగితాలు ఎన్ని సార్లు తిప్పి తిప్పి చూస్తారో ప్రతి ఒక్కరం ఏదో సంధర్భంలో అనుభవించే ఉంటాం. కాని ములుగు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పెద్దగా కాగితాలను చూడకుండానే రిజిస్ట్రేషన్లు చకచకా జరుగుతున్నట్లు శుక్రవారం ఓ విచారణలో నిగ్గు తేల్చారు మండల అధికారులు. మండలంలోని బండారుపల్లి గ్రామానికి చెందిన ఓ ప్రభుత్వ భూమికి ఇంటి నంబర్‌ సృష్టించి దానికి ఫోర్టరీ సంతకాలతో ఓనర్‌షిప్‌ సర్టిఫికేట్‌ సృష్టించి వీటిని ఆధారంగా చేసుకుని 1571.98 స్క్వేర్‌ ఫీట్ల భూమిని రిజీస్ట్రేషన్‌ చేశారు ములుగు సబ్‌ రిజిస్ట్రార్‌ 13 సంవత్సరాలుగా ఇక్కడే విధులు నిర్వహిస్తున్న కనీసం ఫోర్జరీ సంతకాన్ని గుర్తించకుండా రిజిస్ట్రేషన్‌ చేసి విధి నిర్వహణలో జరిగే తప్పులను గుర్తించంలో వారు ఎంతటి మేధావులో ఈ ఘటనతో చెప్పకనే చెప్పారు.

` నిజంగా నకిలీ స్టాంపులు ఆ కార్యలయంలో ఉన్నాయా..? 

ములుగు చుట్టు పక్కల ప్రాంతాల్లోనే గాక భూపాలపల్లిలో గ్రామ పంచాయితీల్లో వందల , వేల సంఖ్యలో నకిలీ ఇంటినంబర్లతో ఇలాంటి రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఆనేక అనుమానాలను స్థానిక ప్రజలు వ్యక్త పరుస్తున్నారు. కనీపసం గ్రామపంచాయితీ అధికారులకు తెలియకుండానే ఓనర్‌షిప్‌ సర్టీఫికేట్లు , ఇతర అనుమతి పత్రాలను సృష్టించి అనేక రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఆరోపనలు వస్తున్నాయి. పైగా రిజిస్ట్రేషన్‌కు అవసరమైన అన్ని నకిలీ పత్రాలను ఆ కార్యలయంలోనే అందుబాటులో ఉంచకుని ఆ అధికారికి దగ్గరగా ఉండే వ్యక్తులకు వందల ఎకరాల భూములను పంచినట్లు తెలుస్తున్నది. 

 ` బోచ్చు సమ్మయ్య , సుజాతలు విచారణకు హాజరు కాలేదు : ఎంపివో హన్మంతరావు 

అక్రమ ధృవీకరణ ఆరోపణలు ఎదుర్కోంటున్న బోచ్చు సుజాత , బోచ్చు సమ్మయ్యలను శనివారం జరిగే విచారణకు హాజరు కావలని సమాచారం అందించాం కాని వారు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. విచారణకు హాజరు కాలేదు. దాంతో పాటు ఆర్డీవోకు అందిన ఫిర్యాధు, వార్త కథనాల నేపథ్యంలో బండారుపల్లి గ్రామపంచాయితీలో ఎంపిడీవో ఆదేశాల మేరకు విచారణ చేశాÊ . ఈ విచారణలో బోచ్చు సమ్మయ్య, సుజాతల పేర ఉన్న ఓనర్‌షిప్‌ సర్టిఫికేట్‌గాని , ఇంటి నంబర్‌గాని గ్రామ పంచాయితీ అధికారి ఇవ్వలేదు. పూర్తిగా ఆ ఆధారాలు నకిలీవి . దాంతో పాటు వారు చూపుతున్న తేదిల్లో ఒక్కడ విధులు నిర్వహించిన సేక్రటరీ సతీష్‌ విచారణకు హాజరయ్యారు. విచారణలో తాను వీరికి ఎలాంటి అనుమతులు గాని ధృవికరణ పత్రాలు గాని ఇవ్వలేదని చెప్పారు. ఇట్టి విచారణలో పూర్తిగా సమ్మయ్య, సుజాతలు కలిగి ఉన్న ఆధారాలు నకిలీవి మరియు సేక్రటరీ సతీష్‌ సంతకాన్ని ఫోర్టరీ చేసినట్లు తెలుస్తున్నది. దీనిపై పై అధికారులకు సమాచారమిచ్చి తగిన చర్యలను కోరతాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!