తెలంగాణ బహుజన సమైక్య ఆధ్వర్యంలో బుధవారం రోజున హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం టి బి ఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చంటి ముదిరాజ్ మాట్లాడుతూ జిల్లాలో ప్రవేట్ విద్యాసంస్థల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతుందని యజమాన్యాలు ఇష్టరాజ్యంగా వ్యవహరించడంతో సామాన్యుడికి ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారుతుందని అన్నారు. వెంటనే జీవో ఎంఎస్ నెంబర్ వన్ ప్రకారం ఫీజుల వివరాలను నోటీస్ బోర్డుపై పెట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ బహుజన సమైక్య రాష్ట్ర కన్వీనర్ స్రవంతి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సౌరం అభిలాష్,సుధాకర్ అడ్వకేట్,రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ నామిండ్ల హరీష్,అఖిల్,మహిపాల్, బొగం సంధ్య తదితరులు పాల్గొన్నారు..
ప్రైవేట్ స్కూల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి
