
రామాయంపేట(మెదక్)నేటి ధాత్రి.
రామాయంపేట పట్టణ బైపాస్ రోడ్డు గల విద్యుత్ స్తంభానికి వైర్లు ప్రమాదకరంగా మారాయి. పట్టణ శివారులోని మెదక్ రోడ్డు బైపాస్ రోడ్డుపై విద్యుత్ వైర్లు చత్తీస్గఢ్ నుండి వచ్చే రోడ్డు విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా విడదీసి ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్తంభంపై న కాస్రాలు ఊడిపోయి మూడు సంవత్సరాలు అవుతున్న పట్టించుకోని అధికారులు ప్రజలు ఈ విషయమై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. గత మూడు సంవత్సరాల నుండి ప్రజలు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అలాగే పలు సందర్భాల్లో ఈ లైన్ విషయంగా వ్యవసాయ శాఖ అధికారులకు సైతం ఫిర్యాదు చేసినప్పటికీ వారు కూడా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకోని చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.