ప్రధాని 8 ఏళ్ల పాలనలో ఎన్నో అద్భుతాలు.

ప్రధాని 8 ఏళ్ల పాలనలో ఎన్నో అద్భుతాలు.

.. కరోన సమయంలో 190 కోట్లు వ్యాక్సిన్లు పంపిణీ.

.. దేశవ్యాప్తంగా 200 మెడికల్ కాలేజీలు మంజూరు.

 

రామాయంపేట(మెదక్)నేటి ధాత్రి.

 

… రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బందికి సన్మానం.

.. బిజెపి పట్టణ అధ్యక్షుడు శంకర్ గౌడ్.

భారత ప్రధాని నరేంద్ర మోడీ 8 ఏళ్ల పాలనలో దేశంలో ఎన్నో అద్భుతాలు సాధించి ప్రజల మన్ననలు పొందాలని రామాయంపేట బిజెపి పట్టణ అధ్యక్షుడు శంకర్ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది కి సన్మానం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోణ వంటి విపత్కర పరిస్థితుల్లో దేశంలో నూట తొంభై కోట్ల వ్యాక్సిన్లు అందించి విజయం సాధించిన ఘనత ప్రధాని మోడీ కి దక్కిందన్నారు. అలాగే బియ్యంలో 200 మెడికల్ కాలేజీలు నూతనంగా మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. కరుణ వ్యాక్సిన్ టీకాలు ప్రపంచంలో పలు దేశాలకు అందించి భారత్ యొక్క శక్తిని చాటిన గొప్ప వ్యక్తి మోడీ అన్నారు. అలాగే జనరిక్ ఆయుర్వేదిక మెడికల్ షాప్ లను తక్కువ ధరలకే ప్రతి జిల్లా మండల కేంద్రాలకు కేటాయించడం జరుగుతుందన్నారు. అన్ని రంగాల్లో ఎన్నో అద్భుతాలు విజయాలు సాధించడం పట్ల ప్రపంచ దేశాలు సైతం భారత్ వైపు చూస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద దేశంలో పేదలకు 3 కోట్ల 20 లక్షల మందికి వైద్య సేవలు అందించిన ఘనత కూడా మోడీ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఎన్ని సంవత్సరాల పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని మరింత అభివృద్ధి చెందేందుకు భవిష్యత్తులో కూడా బీజేపీకి ప్రజలు పట్టం కట్టాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *