పోచారం డ్యాం లో చేప పిల్లలు వదిలిన ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి….

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుంది….

మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి….

కొల్చారం ( మెదక్ )నేటి ధాత్రి :

తెలంగాణ రాష్టం వచ్చిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి కె .సి.ఆర్. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలని ఉద్దేశ్యంతో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారని మెదక్ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. శనివారం పోచారం ప్రాజెక్ట్ లో 6 లక్షల 28 వేల రొయ్యలు , 12 లక్షల 48 వేల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మత్స్య కారుల అభివృద్ధికి, ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయ,సహాకారాలు అందిస్తు ఉచితంగా చేప పిల్లలను కట్ల,రవ్వు, బొచ్చ వంటి పెంపకానికి అనువుగా ఉన్న చేప పిల్లలను అందజేస్తున్నదని అన్నారు. రాబోయే కాలంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో విత్తనోత్త్పత్తి చేసి ఇక్కడే చేప పిల్లలను చెరువులో వదులుటకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని అన్నారు.

గతంలో మత్స్య సంపంద అంటే ఆంధ్రా లోనే ఉండేదన్న భావన ఉండేదని, కాని నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవతో మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడిక తీసి వర్షపు నీటిని ఒడిసి పట్టడం, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా చెరువులను నింపడం, వాటిలో ఉచితంగా చేప పిల్లలను,రొయ్యలను వదలడం ద్వారా మత్స్య సంపదను పెంచి చరిత్రను తిరగ రాశారని అన్నారు. సంపదను సృష్టించి అందరు ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని, కాబట్టి ఆయా చెరువుల పరిధిలో ఉన్న బెస్తవారు, ముదిరాజ్ లు, నూతనంగా మత్స్య సహాకార సంఘాలు ఏర్పాటు చేసుకొని చేపపిల్లల పెంపకంలో ముందుండాలని అభిలషించారు. 

జిల్లాలో ఘనపూర్, కొంటూర్ , హల్దీ వాగు వంటి చెరువులతో పాటు చెక్ డ్యామ్ లు ఉన్న దగ్గర 5 కోట్ల 4 లక్షల చేప చేప పిల్లలను పెంచడం జరుగుతున్నదని అన్నారు. ఒకప్పుడు చేపలు కనబడని తెలంగాణాలో నేడు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు అధికంగా చేపలు ఆహారంగా తీసుకొంటున్నారని, ఇది మత్స్యకారుల అభివృద్ధికి ఊతం ఇస్తున్నదని అన్నారు.  

 ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, మత్స్య శాఖ సహాయ సంచాలకులు రజిని, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *