పెండింగ్ లో వున్నా స్కాలర్షిప్స్ మరియు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చెయ్యాలి

స్కాలరషిప్స్ రాకపోవడంతో అప్పులతో విద్యాసంస్థలను ముసివేస్తున్న యాజమాన్యాలు

ఏ.ఐ.ఎస్.బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు

చేర్యాల నేటిధాత్రి…

చేర్యాల మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు ఆత్మకూరి హరికృష్ణ అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశానికి హాజరైన ఏ.ఐ.ఎస్.బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు పెండింగ్ లో వున్నా స్కాలర్షిప్స్ మరియు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చెయ్యాలని
డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో పుల్లని వేణు మాట్లాడుతూ…… రాష్ట్రంలో గత నాలుగేల్లుగా ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్స్ 5177 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉండటం సిగ్గుచేటు అని, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం సరికాదని ఏద్దేవా చేశారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు రాక పోవడం వల్ల కళాశాల యాజమాన్యాలు టీసీలను ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తా ఉన్నారు. యాజమాన్యాలను గట్టిగా ప్రశ్నిస్తే స్కాలర్షిప్ రెయిన్బర్స్మెంట్ రాకపోవడం వల్ల పూర్తిగా విద్యాసంస్థలు దెబ్బతిన్నాయని అప్పులలో కూలిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు మరియు కళాశాల యాజమాన్యాలు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. చాలామంది విద్యార్థులు గ్రామాలలో పేద మధ్య, తరగతి విద్యార్థులు కావున వారు మధ్యలోనే చదువును ఆపేసే పరిస్థితి నెలకొంటూ ఉన్నదని ప్రభుత్వం విద్యార్థుల పట్ల, విద్యారంగం పట్ల సముకత చూపకుండా విద్యార్థుల భవిష్యత్తులను గాలికి వదిలేస్తుందని వారు అన్నారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పక్షాన ఆలోచన చేయాలని పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ మరియు ఫీజురియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గడిపే సుజిత్, నంగి తిరుపతి, బుచ్చం గణేష్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!