పరకాల నేటిధాత్రి(టౌన్)
హనుమకొండ జిల్లా పరకాల ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవాన్ని పురస్కరించుకుని పరకాల మండలంలోని నాగారం గ్రామంలో శనివారం రోజున పసుల పుష్ప,జూపాక భద్రయ్య,జాలిగాపు చుక్కయ్య,జాలిగపు స్వరూప నాలుగు పేద కుటుంబాలకు బియ్యం నూనె పప్పు ధాన్యాలు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఫోటోగ్రఫర్స్ యూనియన్ సభ్యులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.