మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలో సర్పంచుల పదవీ కాలము జనవరి నెలలో పూర్తి అయినందున సోమవారం రోజు నవాబుపేట మండలంలోని అమ్మాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ సత్యం కి సన్మాన కార్యక్రమం అమ్మాపూర్ గ్రామం నందు నిర్వహించడం జరిగింది. గ్రామ యువకులు మాట్లాడుతూ, ఐదు సంవత్సరాల పదవీ కాలంలో సర్పంచులు వివిధ గ్రామాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేస్తూ కొనియాడారు. అనంతరం సర్పంచికి శాలువా, పూల మాలలతో సన్మానించడం జరిగింది. సత్యం మాట్లాడుతూ, తమ పదవీ కాలములో సహకరించిన అమ్మ పూర్ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అమ్మ పూర్ గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు