పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్ కి స్వాగతం

అధిక ఫీజులు, అధిక పర్మిషన్ ల పై విచారణ లేవి

త్వరిగతిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

మండల ప్రధాన కార్యదర్శి సందుపట్ల లక్ష్మారెడ్డి

ఎల్లారెడ్డిపేట(రాజన్న సిరిసిల్ల) నేటిధాత్రి

ఎల్లారెడ్డిపేట మండల భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గారు నిన్నటి రోజున ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ కార్యదర్శి గారిని సస్పెండ్ చేయడం స్వాగతిస్తూనే కలెక్టర్ గారు కొండను తవ్వి ఎలుకలు పట్టిన చందాన వారి చర్యలు ఉండడం ప్రజాస్వామ్యాన్ని కూనిచేయడంలా ఉందని అన్నారు. గత ఆరు నెలలుగా ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ లో నిధుల దుర్వినియోగం అవినీతి , ఇండ్ల పరిమిషన్లలో డబ్బులు తీసుకోవడం అట్టి విషయాలపై భారతీయ జనతా పార్టీ సాక్షాదారాలతో సహా అధిక ఫీజు వసూల్ చేయడం పై ఇంటి యజమానులతో వాంగ్మూలం తీసుకుని చర్యలు చేపడతాం అని డిపిఓ వచ్చి విచారణ చేపడతామని తెలిపి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు చర్యలు లేకపోవడం మీ నిర్లక్ష్యానికి మొదటి మెట్టు.మొక్కలను పరివేక్షణ పెంపకం లో పంచాయతీ కార్యదర్శి గారి నిర్లక్ష్యానికి సస్పెండ్ చేసినారు మరి అవినీతి ఆరోపణలు గ్రామపంచాయతీలో జరిగిన వాటిపై విచారణలో ఎలాంటి సమాధానం రాకపోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు వాపోతున్నారు.నిధుల దుర్వినియోగం అవినీతి ఇండ్ల పర్మిషన్ పై జరుగుతున్న అధిక ఫీజు వసూల్ పై కలెక్టర్ డిపిఓ స్పందించి చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరిగింది. చర్యలు తీసుకొని పక్షంలో డిపిఓ గారిపై సంబంధిత అధికారులపై లోకాయుక్తలో ఫిర్యాదు చేసి నిగ్గు తెలుస్తమని అన్నారు. ఎప్పటికైనా తప్పు చేసిన వ్యక్తి శిక్ష అనుభవించాలని, ప్రజా సామ్యంపై రాజ్యాంగంపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా అధికారులు పనిచేయాలని అధికారులు ప్రజలు కట్టే పన్నుతో జీతం తీసుకుంటున్నారు.అధికార పార్టీ అండదండలు ఉన్నాయని అధికార పార్టీ నాయకులు ఎన్ని రోజులు కాపాడుతారని ఎప్పటికి మీ ప్రభుత్వం ఉండాలని తప్పు చేసిన వారు ఎప్పటికైనా శిక్ష అనుభవిస్తారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *