నేరాల నియంత్రణనే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుంది

డిఎస్పీ నాగేంద్రచారి

రుద్రంగి మండల కేంద్రంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

రుద్రంగి,నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో
నేరాల నియంత్రణనే లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుందని డిఎస్పీ నాగేంద్రచారి అన్నారు.
రుద్రంగి మండలంలోని వడ్డెర కాలనిలో శుక్రవారం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి, సరైన పత్రాలులేని 30 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు. సరైన పత్రాలు చూపించి, వాహనాలు తీసుకవేళ్ళవచ్చన్నారు. గొళ్ళెం రెడ్డి ఇంట్లో తనిఖీ చేయగా జంతువులను వేటాడటానికి ఏర్పాటు చేసుకున్న వల స్వాధీనం చేసుకొని, గొళ్ళెం రెడ్డి బైండోవర్ చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ
పోలీసులు ఉన్నది ప్రజల రక్షణకే అని, ప్రజలకు పోలీసులు భద్రత, భరోసా కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. గ్రామాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే, పోలీసులకు లేదా డయల్100 కి సమాచారం అందించాలని కోరారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ కూడదని, యువత చెడు అలవాట్లకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. గ్రామాల్లోకి గంజాయి మూలాలు రాకుండా చూసుకోవలసిన బాధ్యత గ్రామ ప్రజలాదేనని అన్నారు. అలాంటి సమాచారం ఉంటే పోలీస్ వారికి సమాచారం అందించాలన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా, ట్రాఫిక్ నియమాలను పాటించాలని, వాహనాలు నడిపే టప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి అని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని, గ్రామాల్లో అటవీ జంతువులను వేటాడిన అటవీ జంతువుల కోసం విద్యుత్ తీగలు అమర్చినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎనిమాల్ యాక్ట్ ప్రకారం అటవి జంతువులను వేటాడరాదని వివరించారు.
గ్రామాలలో స్వీయ రక్షణ కొరకు సీసీ కెమెరాలను అమర్చుకోవాలని, ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాలలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 ట్రోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయాలని తెలిపారు. అదేవిధంగా మొబైల్ ఫోన్ పోయిన చోరికి గురైనా సీఈఐఆర్ పోర్టల్ నందు పిర్యాదు చేయాలని అన్నారు. సీఈఐఆర్ తో పోగొట్టుకున్న ఫోన్ ను త్వరితగతిన రికవరీ చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుండి ఉపాధి కోసం వెళ్లే వారి నకిలీ గల్ఫ్ ఏజెంట్లు ను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ ఆమోదిత ఆశ్రయించాలని అన్నారు. స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అధికారి ఫోన్ నెంబర్. 8712656411ను సంప్రదిస్తే ఏజెంట్లకు సంబంధించి పూర్తి సమాచారం తెలియజేయడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సి.ఐ కిరణ్ కుమార్, ఎస్.ఐ లు రాజేష్, మారుతి, అశోక్ పాల్గొన్నారు.

error: Content is protected !!