నేటి ధాత్రి కథనానికి స్పందించిన సామాన్య పౌరుడు.

#అధికారులు ఎవరు పట్టించుకోకపోవడంతో గుంతలమైన రోడ్డును మరమ్మతు చేయించిన వ్యాపారి.

#నేటి ధాత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసిన వాహన చోదకులు.

నల్లబెల్లి, నేటి ధాత్రి: గత కొద్ది రోజుల క్రితం నల్లబెల్లి మండల కేంద్రం నుండి నందిగామ గ్రామంకు వెళ్లే రహదారి ధ్వంసమై పలువురు ప్రమాదాలకు గురవుతున్నారని నేటి ధాత్రిలోప్రచురించగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎవరు స్పందించక పోవడంతో లెంకలపల్లి గ్రామానికి చెందిన ఇటుకలవ్యాపారి పుల్లూరి శివప్రసాద్ తన సొంత ఖర్చులతో గుంతల మయమైన రోడ్డును డస్టుతో పూడ్చడంతో వచ్చిపోయే వాహనదారులు, పాదాచారులు సమీప గ్రామ ప్రజలు శివ ప్రసాద్ ను అభినందించారు అలాగే రోడ్డు దీనస్థితిని వార్త కథనం రూపంలో వెలుగులోకి తీసుకువచ్చిన నేటి ధాత్రి యాజమాన్యానికి సమీప గ్రామ ప్రజలతోపాటు వాహన చోదకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *