స్టేషన్ ఘనపూర్ జనగాం నేటి ధాత్రి
నిరాశ చెందిన కాంగ్రెస్ శ్రేణులు
టి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొరకు ఎదురుచూసిన పార్టీ శ్రేణులకు నిరాశే మిగిలింది
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ చేపూరి చిరంజీవి ఆధ్వర్యంలో టి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాక కొరకు స్వాగతం పలకడం కోసం కార్యకర్తలు ఎదురు చూశారు కానీ రేవంత్ రెడ్డి ఆగకుండా పోవడంతో ఉదయం 10 గంటలనుండి మూడున్నర గంటల వరకు రేవంత్ రెడ్డి రాక కోసం ఎదురుచూసిన కార్యకర్తల్లో నిరాశ మిగిల్చిన టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి,
అనంతరం ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ చేపూరి చిరంజీవి మాట్లాడుతూ
వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గం విస్తృతస్థాయి సమావేశానికి కాంగ్రెస్ పార్టీ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కార్యకర్తలకు దిశా నిర్దేశం కి సమావేశం ఏర్పరచగా అక్కడికి వెళుతున్న సందర్భంలో స్టేషన్గన్పూర్ లో ఒకడానికి పెద్ద ఎత్తున ప్రతి మండలం నుండి ముఖ్య కార్యకర్తలు మహిళలు అందరు విచ్చేసి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నామని మా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అత్యవసరంగా సమావేశానికి హాజరయ్యే దశలో ఇక్కడ ఆగకుండా వెళ్లిపోయారని అన్నారు ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులని కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు అధికారంలోనికి తీసుకురావాలని ఎదురుచూస్తున్నారన్నారు. అరాచక పాలనకు చరమగీతం పాడే విధంగా ప్రజలు చైతన్యంగా ఉన్నారని బిఆర్ఎస్ పార్టీని గద్దించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.