తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, రేగా కాంతారావు
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
నిమ్స్ హాస్పటల్లో పినపాక నియోజకవర్గం ఆళ్లపల్లి మండలం లోని మర్కోడు గ్రామానికి చెందిన కొమరం జగన్ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న సమాచారం తెలుసుకొని స్వయంగా వెళ్లి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,రేగా కాంతారావు పరామర్శించి వైద్యుల ద్వారా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.