నాడు స్వరాష్ట్ర ఆకాంక్ష… నేడు స్వదేశ స్వావలంబన

మంత్రి హరీశ్ రావు ట్వీట్

నాడు తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీ గా ఆవిర్భవించి ప్రజా పోరాటాలతో స్వరాష్ట్ర గమ్యాన్ని చేరింది. నాలుగున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. తన ప్రాణాన్ని పణంగా పెట్టిన ఉద్యమ నేత కేసీఆర్ ప్రజల ఆశీస్సులతో

సిఎం గా బాధ్యతలు చేపట్టి అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలిపారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో కేంద్రప్రభుత్వం..కేంద్ర మంత్రులు..నీతి ఆయోగ్ లు దేశానికి రోల్ మోడల్ , ఆదర్శమని తెలంగాణను ఎన్నోసార్లు అభినందించారు.. 

 

రాష్ట్రం సాదించి అనేక రంగాల్లో అద్భుతమైన విజయం సాదించినట్లు గానే దేశాన్ని కూడా అదే మార్గంలో తీసుకెళ్లాలి..దేశంలో మార్పు తేవాలి అని సీఎం కేసీఆర్ గారు తలపెట్టిన మహా యజ్ఞము ఇది. దేశ రాజకీయాల్లో మనం పోవాలని బి ఆర్ ఎస్ పార్టీ గా పేరు మారుస్తూ గత అక్టోబర్ నెలలో విజయ దశమి పర్వదిననా బి ఆర్ ఎస్ పార్టీ గా మారుస్తునట్లు ప్రకటించారు… నేడు అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘం పార్టీ పేరు మార్పు ను దృవీకరించడం సంతోషకరం..

 

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు..

 

సీఎం కేసీఆర్ గారి నాయకత్వం లో రాష్ట్ర అభివృద్ధి స్పూర్తితో రాబోయే రోజుల్లో దేశంలో మార్పు కోరుకుందాం.. దేశ ప్రజలు స్వావలంబన సాధించేలా అడుగేద్దాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!