నాగ్ పూర్ అంబేడ్కర్ దీక్షాస్థల్ ను సందర్శించిన మాజీ మంత్రి కొప్పుల

ఎండపల్లి (జగిత్యాల )నేటి ధాత్రి
మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని అంబేడ్కర్ దీక్షాభూమి సందర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇది పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది, సామాజిక విప్లవం యొక్క ప్రేరణభూమి (స్పూర్తిదాయకమైన భూమి) నాస్తికమైనది మరియు వర్గ వైరుధ్యాలు, వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా సామాజిక చర్యలకు సన్నాహాలు కూడా భారతదేశంలో అంబేద్కరైట్ బౌద్ధమతం యొక్క మొదటి తీర్థయాత్ర, ప్రతి సంవత్సరం లక్షలాది మంది యాత్రికులు దీక్షా భూమిని సందర్శిస్తారని కొప్పుల ఈశ్వర్ గుర్తు చేశారు ముఖ్యంగా ధమ్మ చక్ర ప్రవర్తన్ దిన్ అంటే సామ్రాట్ అశోక విజయ దశమి (“సామూహిక మార్పిడి వేడుక దినం”) మరియు 14 అక్టోబర్, బిఆర్ అంబేడ్కర్ గారు ఇక్కడ బౌద్ధమతం స్వీకరించి బౌద్ధమతం స్వీకరించిన స్మారక దినం.అతని ఆఖరి మతపరమైన చర్య బౌద్ధమతాన్ని స్వీకరించడం మరియు భారతదేశాన్ని బౌద్ధ దేశాన్ని మార్చాలి అనుకున్నారని కొప్పుల ఈశ్వర్ అన్నారు
ప్రపంచంలోనే ఇక్కడ అతిపెద్ద స్థూపం అతని జ్ఞాపకార్థం ఆ ప్రదేశంలో నిర్మించబడింది.
తెలంగాణ రాష్ట్రం లో కెసిఆర్ గారి అధ్యక్షతన హైదరాబాద్ లో 125 అడుగుల పొడవైన విగ్రహం, 36 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతి వనాన్ని నిర్వహించి, ఆవిష్కరించడం జరిగిందని కొప్పుల ఈశ్వర్ అన్నారు ,అంతకు ముందు అంబేడ్కర్ దీక్షాభూమిని, మ్యూజియం, కమ్యూనిటీ హెల్, బోధి వృక్షం, బుద్ద దేవాలయాన్ని కొప్పుల ఈశ్వర్ సందర్శించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!