నవ యుగ వైతాళికుడు

ఆచరణాత్మక కార్యదక్షుడు

కార్యాచరణకు కృషీవలుడు,

తెలంగాణ స్వాప్నికుడు

తెలంగాణ కల సాధకుడు,

రేపటి తరం దార్శనికుడు,

దేశ భవిష్యత్తుకు రాజకీయ నిర్ధేశకుడు

తెలంగాణ వెలుగులు, దేశానికి అద్దే కార్యశీలుడు.

తెలంగాణ ప్రగతిలో దేశానికి ఆదర్శప్రాయుడు……

 సహజంగా వైళాలికుడు అని కవులను, సంస్కర్తలను పిలుస్తుంటారు. అయితే కేసిఆర్‌ నవయుగ వైతాళికుడు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకుడే కాదు. ఉద్యమ కారుడు. పోరాట యోధుడు. రాజకీయ చాణక్యుడు. కవి, వక్త, సంస్కర్త కలగలిసిన ఈరం ఏకైక నాయకుడు. భవిష్యత్‌ తరాలకు దార్శనికుడు…నిన్నటి తరం కల నిజం చేసిన స్వాప్పికుడు. రేపటి తరాన్ని గురించి నిరంతం ఆలోచించే నిర్ణయాత్మక కృషీవలుడు. ఉద్యమ కారుడిగా అరవైఏళ్ల తెలంగాణ కలను నిజం చేసిన నవతరం నాయకుడు. తెలంగాణ వచ్చే దాకా తెగించి కొట్లాడిన శూరుడు. పద్నాలుగేళ్లు అనేక అవంతరాలను ఎదుర్కొని విజయాన్ని తెలంగాణ ముద్దాడేలా చేసిన వీరుడు. జన సామాన్యంలో బహుళ ప్రచార సాధనమైన తెలంగాణ పాటలకు వన్నెలద్దాడు. పాటకు వెన్నల, వెలుగులద్దిన నాయకుడు కేసిఆర్‌. స్వయంగా పాటలు రాసి, తెలంగాన ఉద్యమ పాటలను ఉర్రూతలూగించాడు. పోరాటాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేశాడు. గారడి చేస్తుండ్రు, గడిబిడ చేస్తుండ్రు అంటూ పాలకుపై విరుచుకుపడ్డాడు.

నాటి కుటిల నీతిని ఎత్తి చూపాడు. పాటతో ఎలుగెత్తి చాటాడు. తెలంగాణ సాంస్కృతిక రంగానికి పూర్వ వైభవం తెచ్చిండు. తెలంగాణ అంటే పాట…పాట అంటే తెలంగాణ అనేంతగా గుర్తింపు తెచ్చిండు. తెలంగాణ ఉద్యమంలో పాటల ప్రస్తానం కీలక భూమికచేశాడు. కొన్ని వేల మంది కళాకారులకు కొత్త జీవితాలు ఇచ్చాడు. పాటకు వేనోళ్ల తెలంగాణ గొంతులకు జీవం పోశాడు. పాటగా ప్రపంచమంతా తెలంగాణను గోసను విపించాడు. ఇప్పుడు తెలంగాణను కీర్తించేలా చేస్తున్నాడు. ఒకనాడు పాటంటే అంద్రాది. రాతంటే ఆంద్రాది. గొంతంటే ఆంద్రాది…స్వరాలు, సరిగమలు, గమకాలంటూ ధీర్ఘాలు!! అవి జీవం లేని గీతాలు..జీవితాలు ఆవిష్కరించలేని గేయాలు. మాటకు రాగమేంది? పాటకు స్వరమేంది? గొంతు సవరిస్తే వినిపించే గోస కూడా పాట కావాలి. పిడికిలెత్తి గొంతెత్తితే రాగం రావాలి. అది పాట కావాలి. జనం గుండెను తట్టాలి. సమాజాన్ని నిద్ర లేపాలి. అది పాటంటే…తెలంగాణ మాటంటే…! తెలంగాణ మాటలో, పాటను చేసి, పాటను రాగంగా మలిచిన మలి తరం పోరాటమే పాట. ఆ పాటకు జీవం దైవం కేసిఆరే… ఆకలి కేకలు పాటలై తెలంగాణ ఉద్యమ కదన రంగంలో భూకంపం సృష్టించింది తెలంగాణ పాట. అలాంటి పాటను ప్రభావితం చేసిన తెలంగాణ యాస విప్లవానికి కేసిఆర్‌ నాంది పలికిండు. అందుకే కేసిఆర్‌ తెలంగాణ నవయుగ వైతాళికుడైండు.

                            నిన్నటి తరం నిజవాది, తెలంగాణ కార్యశీలి, నిర్మాణాత్మక ఆచరణ వాది, రేపటి తరం ఆశల ప్రగతి కేసిర్‌. అతి సందర్భం. అతి ప్రయోజనం. అతి అవసరం అన్నవి రాజకీయాల్లో ఎంతో అవసరం. లేకుంటే ప్రజలు అంత తొందరగా దేన్నీ నమ్మరు. సాధించిన తెలంగాణ కూడా అంతే…కాలం గడిస్తున్న కొద్దీ నమ్మకం పెరుగుతుంది. అలాగే తెలంగాణ ఉద్యమం కూడా పెరిగింది. జనం గుండెల్లో నిండిరది. సకల జనులు తెగించి కొట్లాడిరది. అతి ప్రయోనం కూడా అవసరమే. ఏదైనా మనకు కావాలనుకున్నప్పుడు దాన్ని సాధించుకోవాలి. అందుకు మాటలు చెబితే సరిపోదు. కలలు గంటే నీ దరి చేరదు. దానికోసం నిరంతరం ప్రయత్నించాలి. తెలంగాణ విషయంలో కేసిఆర్‌ చేసింది అదే…జనం ఆచరించేలా చేసింది కూడా ఉద్యమ స్వరూపమే…అతి అవసరం కూడా ఉద్యకారులకు కావాలి. ఈ మూడు గుర్తించిన నాయకుడు ఏదైనా సాధించగలడు. తెలంగాణ ఒక అవసరం అరవై ఏళ్లు గోసపడ్డందకు…అతి అవసరం. తెలంగాణ పల్లెలకు అసవరం. పొలాలకు అవసరం. అస్ధిత్వానికి అవరసం. అతి కూడ కొన్ని సందర్భాలలో అవసరమే అన్నది కూడా కేసిఆర్‌ చూపించారు. అందుకే తెలంగాణ సాధించగలిగాడు. మనకు తెలంగాణ స్వేచ్చను, సంతోషాన్ని, స్వీయ పాలనను కూడా అందిచాడు. బంగారు తెలంగాణ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. అరవై ఏళ్ల పాలనలో పడిన అగాధాలన్నీ పూడ్చాడు. ఆ గోసలన్నీ తీర్చాడు. నీళ్లు తెప్పించాడు. చెరువులు నింపించాడు. ప్రాజెక్టులు కట్టించాడు. కాలువ ద్వారా నీటి పరవళ్లు చూపించాడు. తెలంగాణలో పడిపోయిన భూగర్భ జలాల మట్టాలను పెంచారు. నడి ఎండల్లో కూడా చెరువులు నింపుతూ నీళ్ల కొదువ లేకుండా చేశాడు. అటు రైతు రాజ్యం, ఇటు కుటుంబ సంక్షేమంతో అనేక రంగాల్లో రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిని సాధించేందుకు కృషి చేస్తున్నాడు. కరంటు కోతలు , ఉక్కపోతలు, పంటలు ఎండుడు చూసిన తెలంగాణలో కరంటు వెలుగులు చూస్తున్నాం. ఉక్కపోతులు లేకుండా చేసుకున్నాం. పంటలు ఎండుడన్న ముచ్చటే లేకుండా చేసుకున్నాం…. 

                           తెలంగాణ ప్రజలు ఎంత రాజకీయ చైతన్య వంతులో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1971లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితికి పార గుర్తు కేటాయించినా పది మందిని లోక్‌సభకు పంపిన చరిత్ర తెలంగాణ ప్రజలది. తెలంగాణ ఉద్యమానిది. దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన నెహ్రూ కన్నా, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో భూమి కోసం, భుక్తి కోసం, బాసినసంకెళ్ల విముక్తి కోసం కొట్లాడిన రావి నారాయణ రెడ్డికి 1952 తొలి ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వచ్చాయి. దాంతో పార్లమెంటు భవనం ప్రారంభం చేసిన రావినారాయణ రెడ్డి మూలంగా ఆ ఘనత కూడా తెలంగాణకే దక్కింది. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ అన్న పదంలోనే ఒక వైబ్రేషన్‌ వుంది. అది ముఖ్యమంత్రి కేసిఆర్‌ను చుట్టుకున్నది. అందుకే ఉద్యమ స్వరూపం ఎంచుకోవడానికి ముందే ఎన్నికల ప్రక్రియ ఎదురొచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన కొంత కాలానికే స్ధానిక సంస్ధల ఎన్నికల రూపంలో తొలి పరీక్ష ఎదురైంది. అనూహ్యమైన సీట్ల గెలుపుతో తెలంగాణ ఉద్యమ బలానికి ఓట్లు తోడయ్యాయి. 2001 జూలైలో జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో తెరాస మొత్తం తెలంగాణలో 87 జడ్పీటీసిలు, 84 ఎంపిపిలు, 1000 ఎంపిటిసీలు గెల్చుకున్నది. కేసిఆర్‌కు అడుగకు బలమొచ్చింది. తెలంగాణ ఆశయానికి బలం చేకూరింది. తెలంగాణ తెవాలన్న కసిని మరింత కేసిఆర్‌లో పెంచింది. 

                          తెలంగాణ ప్రజల్లో గూడుకట్టుకొని వున్న తెలంగాణ భావజాలం మరోసారి నిరూపనైంది. తెలంగాణ వాదాన్ని అటు ఉద్యమ రూపంలో, ఇటు ఎన్నికల రూపంలోనూ ముందుకు తీసుకెళ్తే విజయం తప్పదు అని మరోసారి రుజువైంది. 1969లో పాలపొంగులా ఒక్కసారి ఉవ్వెత్తున ఎగసి తెలంగాణ ఉద్యమం హింసాత్మకమైంది. రాజకీయ నాయకుల స్వార్ధానికి తెలంగాణ బలైంది. చప్పున చల్లారింది. అందుకే ఆ తప్పు జరక్కుండా సుధీర్ఘ ఉద్యమ ప్రస్ధానాన్ని ఎంతో ఓపికతో కేసిఆర్‌ నడిపించారు. అందుకు సాక్ష్యంగా రaార్ఖండ్‌ ముక్తి మోర్చా లాగా రాష్ట్రం సిద్ధించేదాకా కొట్లాడతానని ఒక నమ్మకం నింపాడు. తెలంగాణ ప్రజల్లో భరోసా కల్పించేందుకు కరీంనగర్‌లో జరిగిన సింహగర్జనకు శిబూసోరేన్‌ ను పిలిపించారు. కేసిఆర్‌ తన కర్తవ్యం, పట్టుదలను తొలి సభలోనే చూపించాడు. కృష్ణా నదీ జాలాల విషయంలో రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌ పేరుతో జరుగుతున్న దోడిపీని ఎండగట్టారు. ఆలంపూర్‌ నుంచి గద్వాల దాకా 128 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆకలి చావులకు చలించి, భూదాన్‌ పోచంపల్లి లో బిక్షాటన చేసి, ఒక్కో కుటుంబానికి ఆ రోజుల్లో రూ.50వేలు అందజేశారు. ఇలా తెలంగాణ ఉద్యమంలో టిఆర్‌ఎస్‌ ప్రజలకు మరింత చేరువైంది. తెలంగాణ సాధన తన భుజాన వేసుకున్నాడు. ఆ విశ్వాసం ప్రజల్లో నింపేందుకు కేసిఆర్‌ పడరాని పాట్లు పడ్డారు. అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. జాతీయ స్ధాయిలో తెలంగాణ ఉద్యమాన్ని తొలి దశలోనే దేశమంతా చూసేలా చేశారు. 1969 ఉద్యమ కాలంలో తెలంగాణ ఇవ్వడం కన్నా కుదరని తేల్చి చెప్పిన అప్పటి హోం శాఖ సహాయ మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌తోనే 2003లో తెలంగాణనుంచి డిల్లీకి సాగిన కారు ర్యాలీకి స్వాగతం పలికించాడు. ఇలా తెలంగాణ ఉద్యమాన్ని చిన్న చూపు చూసిన వారిలోనూ మార్పు తీసుకొచ్చి, తెలంగాణకు అనుకూలంగా మార్చారు. ముప్పై ఎనమిది పార్టీల మద్దతు కూడగట్టాడు.

                           కేంద్ర ప్రభుత్వం నుంచి బైటకు వచ్చిన మరుసటి రోజే కేసిఆర్‌ జంతర్‌ మంతర్‌ వద్ద దీక్షను చేపట్టాడు. తమకు పదవులు కాదని నిరూపించాడు. తమకు రాష్ట్రం ముఖ్యమని ప్రజల్లో మరోసారి ఉద్యమ స్పూర్తిని రగిలించారు. తెలంగాణ ఉద్యమంలో పదవుల రాజీనామాలను తెలంగాణ బాపూజీ కొండా లక్ష్మన్‌ బాపూజీని ఆదర్శంగా తీసుకొని ముందుకు కదలాడు. అడుగడుగునా తెలంగాణ ఉద్యమాన్ని రగిలించడానికి, ఉవ్వెత్తున తెలంగాణ ఎగసిపడేందుకు రాజీనామాల అస్త్రాలను కేసిఆర్‌ వాడుకున్నాడు. కొత్త తరం ఉద్యమ రాజకీయ పంథాతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దారులు వేశాడు. తన ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ ప్రకటనకు కారణమయ్యాడు. చరిత్రలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దోహదమయ్యాడు. తెలంగాణ చరిత్ర వున్నంత కాలం తన పేరును పదిలం చేసుకున్నాడు. కేసిఆర్‌ అనే మూడక్షరాలను తెలంగాణలో సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. తెలంగాణ జాతిపితయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!