కేసిఆర్ ను మించిన నాయకుడు లేడు.
అంతటి రాజనీతిజ్ఞుడు దేశంలో మరొకరు లేరు…
దేశ సౌభాగ్యం కోసం ఆలోంచిచే ఏకైక నాయకుడు…
జాతీయ పార్టీ నిర్మాణం ఒక్క కేసిఆర్ తోనే సాధ్యం.
తెలంగాణ ప్రగతి దేశానికి అందించాలనుకుంటున్నాడు.
రాజకీయాలు తప్ప, ప్రగతి దారులు చూపిన పార్టీలకు కాలం చెల్లింది…
కేసిఆర్ నాయకత్వంలో కొత్త తరం ఆవిషృతమౌతుంది…
అది సమీప భవిష్యత్తులోనే సుసాధ్యమౌతుంది…
కేసిఆర్ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడుతుంది…
లక్ష్య సిద్ది ఎవరినైనా ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. మానవతా వాదిగా మార్చుతుంది. తన జీవిత లక్ష్యంతో పాటు సామాజిక సృహను కూడా నింపుతుంది. ప్రజలకు చేరువచేస్తుంది. ప్రజల చేత మన్ననలు పొందేలా చేస్తుంది. ప్రజల గుండెల్లో గూడుకట్టుకునేలా చేస్తుంది. తన సామాజిక సేవా గుణం, నిండైన వ్యక్తిత్వం గొప్పగా కీర్తిని అందిస్తుంది. అలా ఎదిగిన, పేదలకు అండగా నిలిచిన వారిలో వద్దిరాజు రవిచంద్ర ఒకరు. వ్యాపార వేత్తగా ఉన్నతమైన విజయాలు అందుకున్నారు. సామాజిక వేత్తగా గుర్తింపు పొందారు.
పేదల పక్షపాతి అని కొనియాడబడుతున్నారు. టిఆర్ఎస్ కు బలమైన బిసి. సామాజిక వర్గ నేతగా ఎదిగారు. తెలంగాణ ఉద్యమ కారుడిగా తన వంతు పాత్ర పోషించారు. అలాంటి వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సారి ఖమ్మంలో అడుగుపెడుతున్నారు. వద్దిరాజు రవిచంద్ర తో నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు మాటామంతిలో ఆసక్తి కరమైన వ్యాఖ్యలు…. వద్దిరాజు మాటల్లో….కట్టా అక్షరాలలో…
మా కాలం చీకటి దొంతర. నేటి కాలం వెలుగుల పండగ…వేకువకే వెండివెన్నెల…కాదని అనే వాళ్లు లేరు…మా బాల్యంలో కరంటు జాడలు అప్పుడప్పుడే కనిపించిన కాలం… అయినా తెలంగాణ వచ్చే దాకా తెలంగాణ పల్లెలు చీకటి మయం…ఒక్క హైదరాబాద్ మినహా, తెలంగాణ లోని ఏ నగరం నిరంతరం కరంటు చూసింది లేదు….కోతలు లేకుండా హైదరాబాదులో నిరంతర సరఫరా ఏ కాలంలోనూ లేదు…అంతెందుకు 2013లో కూడా రోజులో గంట నిరంతర కరంటు చూసిన పల్లె లేదు…అసలు పగలంతా పల్లెల్లో కరంటే వుండేది కాదు. ఒక దశలో బ్యాంకుల్లో లోన్ తీసుకొని సోలార్ ప్యానల్స్ అమర్చుకున్నవాళ్లున్నారు. ఇన్ వర్టర్లు కొనుగోలు చేసుకున్నారు. చిన్న చిన్న షాపులు సైతం జనరేటర్లు వాడుకున్నారు. ఎండాకాలం నరకం చెప్పనలవి కానిది…ఇవన్నీ ఈ తరానికి తెలియాలి. ఇదంతా ఎప్పుడో అనుకుంటారు. ఎనమిదేళ్ల క్రితం వరకు సంగతి అని తెలియాలి. తెలంగాణ రాక ముందు కూడా కరంటు సరఫరా ఇలాగే వుండేదనుకునే అవకాశం వుంది.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు కరంటు గోసలు పెట్టి, పంటలు ఎండబెట్టి, తెలంగాణ పల్లెల బతుకులు చిద్రం చేశారు…! అయితే చాలా మంది తెలంగాణ వస్తే అద్భుతాలు జరుగుతాయా? అనుకున్న వాళ్లే… అందరిలోనూ ఈ అనుమానం అందరిలోనూ వున్నదే…కానీ ఒక్కరిలో మాత్రం ఏ అనుమానం లేదు… దానిపై మరో ఆలోచన లేదు…తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే బంగారు తునుక అవుతుందని నమ్మిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి కేసిఆర్… తను నమ్మిన కలను, నిజం చేసి చూపించిన కార్యదీక్షాపరుడు. నిజానికి తెలంగాణ వస్తే పల్లె రూపురేఖలు ఎలా మారుతాయి? పల్లె బతుకుల్లో ఎలా వెలుగులు నిండుతాయి? పట్టణాల అభివృద్ధి ఎలా జరుగుతుంది? తెలంగాణ ప్రజల జీవన ప్రమాణం ఎలా పెరుగుతుంది? అన్న దానిపై నిత్యం ఏదో ఒక చోట ముఖ్యమంత్రి కేసిఆర్ చెబుతూనే వుండే వారు. అలా చెప్పీ చెప్పి నమ్మించడానికి ఎంతో కాలం పట్టింది. కానీ ఆయన ప్రజలను నమ్మించడానికి పట్టిన సమయంలో కనీసం ఐదో వంతు సమయం కూడా తీసుకోకుండానే తెలంగాణలో వెలుగులు నింపాడు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా రెప్ప పాటు కోత లేని కరంటు సరఫరా చేస్తున్నాడు…ఇలాంటి విజయం చూసిన రాష్ట్రం ఒక్క తెలంగాణే. దేశంలో తెలంగాణ తప్ప మరొకటి లేదు…ఆ నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆర్. ఇలాంటి విజయాలు అందించిన కేసిఆర్ తప్ప మరొక నాయకుడు , పాలకుడు లేరు. మరి ఇంతటి నిరంతర వెలుగులు దేశానికి అందాలని కోరుకుంటున్న రాజనీతిజ్ఞుడు… నిరంతరం వెలుగులు నిండిన దేశం కావాలని కోరుకుంటున్న నాయకుడు కూడా ఒక్కరే… ఆయనే కేసిఆర్ . అందుకే దేశానికి రాజకీయ నాయకత్వం ఒక్కటే సరిపోదు. ప్రగతి శీల భావనలున్న ఉద్యమ కారుడు, పోరాట యోధుడు కేసిఆర్ కావాలి. ఈ తరంలో భూతద్దం పెట్టి మొత్తం మన దేశం వెతికినా అలాంటి నాయకుడు కనిపించేది ఒక్క కేసిఆరే…ఆయనది జాతి దృక్పథం… జాతీయ దృక్పథం… అందుకే తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన కొంత కాలానికే ఆంద్రప్రదేశ్ లో ప్రకృతి వైపరీత్యాలు ఎదురైతే సాయం అందించిన చేయి కేసిఆర్ ది. అదీ ఆయన వ్యక్తిత్వం… నాయకత్వం… పాలనలో ఔన్నత్యం…ప్రజలెక్కడి వాళ్లైనా ప్రజలే….రైతులు ఎక్కడి వాళ్లైనా అన్న దాతలే…అందరికీ నీళ్లందాలి. అన్ని రాష్ట్రాలు సుభిక్షం కావాలని కోరుకునే ఓ తరం నాయకుడు కేసిఆర్….మరి అలాంటి నాయకులు లేకనే దేశం ఇలా వెనుబడిపోతోంది. తెలంగాణ లో ఇన్ని సంక్షేమ పథకాలు అమలౌతున్నా, కనీసం వాటిని తమ రాష్ట్రంలో అమలు చేయాలన్న సోయి ఆయా రాష్ట్రాలకు లేదు. అన్ని రాష్ట్రాలలో తెలంగాణ పథకాలు అమలు చేయాలన్న చిత్తశుద్ధి కేంద్రానికి లేదు. అందుకే తెలంగాణ విజయాలు దేశానికి దిక్సూచి కావాలి. కేసిఆర్ దేశానికి నాయకత్వం వహించాలి. అప్పుడే దేశ ప్రగతి, పురోగతి సాధ్యం.
ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పింది ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు…ఎనమిదేళ్లు గడిచినా ఒక్కటీ ఇచ్చింది లేదు. ఆఖరుకు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ , ఐటి శాఖ మంత్రి కేటిఆర్ ప్రశ్నించిన మరుసటి రోజు ఏడాదిన్నరలో పది లక్షల ఉద్యోగాలిస్తామని ప్రధాని మోడి ప్రకటించారు. అసలు ఇస్తామన్నవి ఏటా రెండు కోట్లు. ఆఖరుకు ప్రకటించింది పది లక్షలు. అవి కూడా ఆచరణలోకి వస్తాయన్న గ్యారెంటీ లేదు…నోటిఫికేషన్లు ఇస్తారన్న నమ్మకం అసలే లేదు.
మంత్రి కేటిఆర్ ప్రశ్నించే వరకు కేంద్రం ఉద్యోగాల ఊసే లేదు. ఎంత చిత్తశుద్ధితో కేంద్రం పని చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. దేశ జనాభా 145 కోట్లు. ఎనమిదేళ్లలో ఇవ్వాల్సిన ఉద్యోగాలు 16 కోట్లు. చెప్పుకోవడానికి ఏ మాత్రం మొహమాటం లేకుండా ప్రకటించింది 10 లక్షలు. కానీ అదే బిజెపి తెలంగాణలో నానా యాగీ చేస్తోంది. తెలంగాణ వచ్చిన నుంచి ఇప్పటి వరకు సుమారు లక్షా ముప్పై వేలకు పైగా ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అదనంగా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్దతిన వేలాది ఉద్యోగాల కల్పన కూడా జరిగింది. తాజాగా ముఖ్యమంత్రి కేసిఆర్ సుమారు 90 వేల ఉద్యోగాలు భర్తి చేస్తామని ప్రకటించారు. గ్రూప్ వన్ నోటిఫికేషన్ వెలువడింది. పోలీసు రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. టెట్ పరీక్ష కూడా పూర్తయ్యింది. త్వరలో మిగిలిన నోటిఫికేషన్లు రానున్నాయి. ఇన్ని కళ్ల ముందు కనిపిస్తున్నా, కేంద్రం ఒక్క ఉద్యోగం ఇయ్యకున్నా రాష్ట్ర బిజెపి పగటి కలలుగంటోంది. ఇదిలా వుంటే దేశం కోసం, ధర్మం కోసమంటూ నిత్యం వల్లించే మాటలు అబద్దాల మూటలని తరలిపోయింది. అగ్నిపథ్ పేరుతో సైనిక నియామకాలు సైతం నాలుగేళ్ల కాంట్రాక్టు నియామకాలను ప్రకటించి బిజెపి, కేంద్ర ప్రభుత్వం తన కపట బుద్దిని బైటపెట్టుకున్నది. ఇంత కన్నా అసలు సిసలు దేశ ద్రోహం వుంటుందా? దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఒక ప్రణాళికా బద్ధంగా ఒక్కో మెట్టు పేర్చుకుంటూ గత ప్రభుత్వాలు వస్తుంటే, బిజెపి అమ్ముకుంటూ పోవడం దేనికి సంకేతం. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ దశ దాటి, మొత్తం అమ్మకాల దుకాణం పెట్టడం సమర్థనీయమా? ఇప్పుడు దేశమంతా జరగాల్సిన చర్చ…వచ్చే ఎన్నికలలో బిజెపికి చరమగీతం పాడే దాకా జరగాలి.
తెలంగాణ అభివృద్ధి గురించి చెప్పాలంటే ఒక్క రోజు సరిపోదు…ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు. అంత గొప్ప పరిపాలన మన ముఖ్యమంత్రి కేసిఆర్ ది. ఎన్నెన్ని విజయాలు…అసలు ఇప్పటికీ ఇది కలా..నిజమా అనిపించకమానదు….ఎనమిదేళ్ల క్రితం తెలంగాణ ఎలా వుండేది. ఇప్పుడెలా వుంది. నీరు, ఏరు, గోదారి పరుగు, పల్లె చిగురు, పైరుసాగు, పచ్చని ప్రకృతి, ప్రగతి ఇలా అన్ని రంగాలలో పురోగతి. ఇదంతా దేశమంతా కనిపిస్తే, మన దేశం ఎంత సుందరం…ఎంత సౌభాగ్యం… ఇదంతా దేశమంతా సాధ్యం కావాలంటే కేసిఆర్ నాయకత్వంలోనే జరగాలి. ముందు ముందు ఇంకా ఎంతో మాట్లాడుకోవాల్సి వుంది… దేశానికి చెప్పాల్సింది ఎంతో వుంది…జాతీయ పార్టీ నిర్మాణంతో మన ప్రగతి మరింత ముడిపడి వుంది.