వీరన్నపేట సర్పంచ్ కొండపాక బిక్షపతి
వీరన్నపేటలో దొడ్డి కొమురయ్య విగ్రహానికి భూమి పూజ
చేర్యాల నేటిధాత్రి…
చేర్యాల గ్రామంలో దొడ్డి కొమురయ్య విగ్రహం ఏర్పాటు చేయడం హర్షనీయమని వీరన్నపేట గ్రామ సర్పంచ్ కొండపాక బిక్షపతి అన్నారు. బుధవారం చేర్యాల మండల పరిధిలోని వీరన్నపేట గ్రామంలో దొడ్డి కొమురయ్య విగ్రహ నిర్మాణానికి సర్పంచ్ కొండపాక బిక్షపతి చేతుల మీదుగా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. నాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం రాజకర్లకు దేశముకు దొరలను ఎదిరొడ్డి తుపాకి తూటాలకు తెలంగాణ తొలి అమరుడైన దొడ్డి కొమరయ్య జీవితం నేటి తరానికి ఎంతో ఆదర్శనీయమని వారి సేవలను కొనియాడారు. గ్రామంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ ఎలికట్టే శివ శంకర్ గౌడ్, ఉప సర్పంచ్ గౌండ్ల వెంకటేశం, దొడ్డి కొమురయ్య విగ్రహ నిర్మాణ కమిటీ అధ్యక్షులు బింగి చంద్రం, కురుమ సంఘం అధ్యక్షుడు గౌండ్ల బీరయ్య, నిర్మాణ కమిటీ ఉపాధ్యక్షులు సూర్న శ్రీకాంత్, కార్యదర్శి గౌండ్ల సాయిబాబా, మేక రమేష్, చిగుళ్ల కరుణాకర్,రాసురి పోషయ్య, సింహ చంద్రం, బైర లింగం గౌండ్ల, రామస్వామి, డోలు బృందం అధ్యక్షులు బైర అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.