దేశ విధాత…భావి ప్రగతి ప్రధాత

సాగునీటి రంగంలో కొత్త పుంతలు.

వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు

రైతు బంధు దేశమంతా తోడు

దళితబంధు అమలు తీరు

దేశమంతా కోతలు లేని విద్యుత్ వెలుగులు

పారిశ్రామిక రంగంలో పరుగులు

శాస్త్ర, సాంకేతిక రంగాలలో లక్ష్యాలు

భావి భారత ఆవిష్కరణలు

కొత్త తరం సంక్షేమాభివృద్ధికి బాటలు

చెప్పే మాట, చేసే చేత, వేసే అడుగు, చూపే బాట, రాసే రాత, గీసే గీత అన్నీ సరిగ్గా వున్నప్పుడు వెనకడుగు వుండదు. అని ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎప్పుడో నిరూపించాడు. ఇప్పుడు కొత్త మరో కొత్త అడుగుకు శ్రీకారం చుడుతున్నారు. దేశ రాజకీయాలలో మార్పులకు నాంది పలుకుతున్నారు. ఎందుకంటే ఆయన చెప్పిన మాట మరవలేదు. తెలంగాణ తెస్తానన్నాడు. మాట తప్పలేదు. చెప్పిన మాట విడువ లేదు. తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడిరడు. తెలంగాణ నినాదం, ఉద్యమం పద్నాళుగేళ్లు పదిలం చేశాడు. లక్షలాది మంది ఉద్యమకారులలో తెలంగాణ నినాదం నింపిండు. ప్రతి ఒక్కరు జై తెలంగాణ అని నినదించేలా చేశాడు. ఒక్కొక్క తెలంగాణ వాదిని ఒక్కొక్క కేసిఆర్‌లా తయారు చేసిండు. ఏ మాటైతే చెప్పిండో అదే మాటను చేత చూపించిండు. నిరంతరం పోరాటం చేసిండు. నిత్యం ప్రజల్లో ఉద్యమ కాంక్ష రగిలించిండు. ప్రతి నిమిషం తెలంగాణ పదాన్ని గుర్తుచేసుకునేలా చేశాడు. వేసిన ప్రతి అడుగు తెలంగాణ కోసమే వేసిండు. ఇప్పుడు రాకపోతే ఇక తెలంగాణ ఇక ఎప్పుడూ రాదని తెగువు చూపిండు. తెగింపు చూపిండు. తెలంగాణ ప్రజలందరికీ అదే బాట చూపిండు. తెలంగాణ తోవలో నడిపించిండు. తెలంగాణ కోసమే రాతలు రాసిండు…తెలంగాణ వస్తే తెచ్చుకున్న తెలంగాణ ఎలా వుండాలన్నదానిపై ముందే గీతలు గీసిండు…లెక్కలేసి తెలంగాణను బంగారు తెలంగాణ చేసిండు. ఇది నిత్యం..సత్యం. తెలంగాణ వచ్చిన మూడు నెలల్లోనే కరంటు కోతలు లేకుండా చేసిండు. 

                      ఎండా కాలం కూడా కరంటు నిరంతరం ఇచ్చిండు. రెప్పపాటు పోకుండా కరంటు సరఫరా చేసిండు. తెలంగాణ వస్తే చీకటౌతుందని చెప్పిన వారికి రాత్రిళ్లు తెలంగాణలో కరంటు వెలుగులు నింపిండు. వస్తున్న కరంటే సత్యం… రెప్ప పాటు కాలం కూడా పోని విద్యుత్తే సాక్ష్యం. కండ్ల నిండా కరంటు గోసచూసిన తెలంగాణ కండ్ల నిండా కరంటు చూస్తుంది. తెలంగాణ రాకుంటే ఇంకా ఎన్నేండ్లు ఈ చీకట్లు చూడాల్సివచ్చేదో… ఆ కోతలు ఇంకా ఎన్నేళ్లు అనుభవించాల్సివచ్చేదో…ఈ తరానికి తెలియాలి..నాడు పడిన గోసలు పొరుగు రాష్ట్రాలలో వున్నాయన్న సంగతి చెప్పాలి..ఉమ్మడి రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా బతికిన ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించిండు. కరంటు వెలుగుల్లో తెలంగాణ ఆత్మగౌరవం చాటిండు. ఏ రాష్ట్రానికి సాధ్యం కానిది సుసాధ్యం చేసి చూపిండు. తెలంగాణలో వ్యవసాయానికి కూడా ఇరవైన నాలుగు గంటల సరఫరాచేసి ఇదీ తెలంగాణ అని ఎలుగెత్తి చాటిండు. మరి దేశంలోని ఏ రాష్ట్రంలోనూ, ఆఖరికి ఆంధ్రప్రదేశ్‌లోనూ కూడా నిరంతర కరంటు సరఫరా లేదు. కోతలు లేకుండా ఎన్నడూ లేదు. ఇదీ కాదా! తెలంగాణ విజయం. అదంతా ఒక్క రోజులో రాలేదు. పద్నాళుగేళ్ల పోరాటం, కేసిఆర్‌ నాయకత్వంలో, తెలంగాణ స్వయం పాలనా అస్ధిత్వంతో సాధ్యమైంది. ఇలా చెప్పుకుంటూ పోతే నీళ్ల గోస తీరింది. తడారిన గొంతు తెలంగాణ తల్లి తడిసింది. ఫ్లోరైడ్‌ భూతం పారిపోయింది. తినే తిండిలో కూడా కలిసి, కాళ్లు చేతులు వంకర్లు పోయేలా చేసిన ఫ్లోరైడ్‌ కనిపించకుండా భూగర్భంలోకి జారుకున్నది. తెలంగాణలో పెరిగిన నీటి మాట్టాలతో అట్టడుగుకు చేరింది. తెలంగాణ రాకుంటే ఫ్లోరైడ్‌ భూతం మరింత పెరిగేది. సగం తెలంగాణ నడవలేని స్ధితిలో వుండేది. 

                         రాజకీయ చైతన్యం ఏనాడో తెలంగాణలో వుంది. పాలనా సామార్ధ్యం తెలంగాణలో ఎప్పుడో వుంది. తెలుగు చరిత్రకు శ్రీకారం చుట్టిన శాతవాహనులు మన కోటి లింగాల తొలి రాజ్యం. మన కరీంనగర్‌ నుంచి పాలనకు శ్రీకారం. డిల్లీ దాకా పాలన కోసం ప్రయత్నం చేసిన గౌతమీ పుత్ర శాత కర్ణి మనకు ఆదర్శం. దేశంలో తొలి మహిళా తెలంగాణ వీర వనిత, మహారాణి రుద్రమహారాజు పేరుతో పాలన చేసింది. పాలన కొత్త కాదు. కొట్లాడుడు కొత్త కాదు. విజయాలు కొత్త కాదు. చాకలి ఐలమ్య తెగువ, మల్లు స్వరాజ్యం తెగింపు తెలిసిన నేల తెలంగాణ. ఇలా అడుగడుగునా, అణువణువునా చైతన్యమే…ఆ బాటలోనే విరిసిన కుసుమమే కేసిఆర్‌. పోరాట యోధుడే కేసిఆర్‌. ఆ వీరుడే తెలంగాణ విజయాలు దేశానికి అందాలంటున్నాడు. దేశం సుభిక్షంగా వుండాలంటున్నాడు. దేశమంతా సస్యశ్యామలం కావాలంటున్నాడు. ప్రపంచంలో ఏ దేశానికి లేనంత నీటి సంపద మనకు వుందని గుర్తు చేస్తున్నాడు. అటు గంగ, ఇటు యమున, గోదావరి, కృష్ణా, మహానది, కావేరి, నర్మద, తపతి వంటి పెద్ద నదులున్నాయి. ఐదు నదులను కలుపుకొని ఒక రాష్ట్రంగా మారిన సింధు నదితో పాటు దాని ఉప నదులున్నాయి. చీలం, జీతం, చినాబ్‌, రావి, బియాస్‌ వంటి నదులు నీళ్లు పుష్కలంగా వున్నాయి. బ్రహ్మ పుత్ర నది నిండా నీళ్లున్నాయి. ఎన్ని నీళ్లున్నా వున్నా సద్వినియోగం ఎందుకు సద్వినియోగం చేసుకోలేపోతున్నామంటుంటున్నాడు కేసిఆర్‌. దేశంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌లో సగంకూడా వినియోగించుకోకుండానే వృధా అవుతుందంటున్నాడు. నలభై ఏళ్ల క్రితం మన దేశం కంటే వెనుకబడి వున్న చైనా ప్రపంచంలోనే అతి శక్తివంతమైన దేశంగా ఎలా ఎదిగిందో చెబుతున్నాడు. ఎడారిలో కూడా మొక్కలు నాటి, వనాలు చేసి, దేశాన్ని చైనా ఎలా సాగుభూమిగా మార్చిందన్నదానిని గుర్తు చేస్తున్నారు. ఇలా అనేక రంగాల్లో ఇప్పటికే మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడాల్సి వుండాల్సింది. కాని లేదు. ఎందుకు? అని కేసిఆర్‌ ప్రశ్నిస్తున్నాడు. ప్రజల్లో చర్చ జరగాలంటున్నాడు. ఇంకా సబ్సిడీ బియ్యంతో దేశ ప్రజలు బతికే రోజుల్లోకే దేశ ఎకానమీని ఎందుకు నెట్టేస్తున్నారని నిలదీస్తున్నాడు. 

                       ఇప్పటి వరకు ఇలా నిలదీసిన నాయకుడు లేదు. ఏఏ రంగాల్లో మన దేశం వెనుకబడి వుందో చెప్పిన నాయకుడు లేదు. దేశంమీద ఇంత అవగాహన వున్న నాయకుడు మరొకరు లేరు. ఇప్పుడు కావాల్సింది దేశానికి నాయకత్వం కాదు. దిశ`నిర్ధేశం చేసే మార్గం. అయితే నేను, లేకుంటే నువ్వు అని దేశాన్ని పాలిస్తున్న పార్టీలకు ప్రత్నామ్నాయ రాజకీయ వేధిక రావాలి. అది తెలంగాణ నుంచే పరుడు పోసుకోవాలి. ఇది కేసిఆర్‌ రూపంలో రావాలన్నదే తెలంగాణ ప్రజల అభిమతం. ఆకాంక్ష. దేశం సర్వతోముఖాభివృద్ధి సాధనకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వం దేశానికి ఎంతో అవసరం. అందుకు రాజకీయ పార్టీల పునరేకీకరణ కాదు..కావాల్సింది మరో ప్రత్నామ్నాయ రాజకీయ శక్తి. అది తెలంగాణ గొంతులోనుంచి రావాలి. తెలంగాణ తెగింపులో నుంచి రావాలి. తెలంగాణ స్వరంగా వినిపించాలి. తెలంగాణ చైతన్యం దేశమంతా నింపాలి. నూతన ప్రజాస్వామ్య వ్యవస్ధకు దిక్సూచీ కావాలి. దేశ ప్రగతికి బాటలు వేయాలి. దేశమంతా పచ్చబడాలి. పల్లెలన్నీ చిగురించాలి. పచ్చదనం వెల్లివిరియాలి. ప్రతి ఎకరానికి నీరందాలి. ప్రతి మూలలో పంటలు పండాలి. ప్రతి రైతు సంతోషంగా వుండాలి. ఆ రైతుకు తెలంగాణలో అందుతున్నట్లు రైతు బంధు అందాలి. రైతు భీమా అందాలి. పండిన పంటకు గిట్టుబాటు ధర రావాలి. స్వేచ్చా మార్కెట్‌ ఏర్పాటు కావాలి. రైతుల వద్దకే వచ్చి వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేసుకునే రోజులు రావాలి. ఇది కేసిఆర్‌ కల. 

               తెలంగాణలో నెరవేరిన కల కళ్లారా చూస్తున్న రైతు దేశమంతా కావాలి. ఆ కల నిజమై దేశమంతా చూడాలి. దేశరైతులు సుబిక్షంగా వుండాలి. ప్రపంచానికే మన ఎగుమతులు పెరగాలి. నాణ్యమైన పంటలు ప్రపంచానికి అందించాలి. ఎకానమీలో కూడా సాగు విప్లవం చూపించాలి. ఇదీ ప్రతి రాజకీతిజ్ఞుడు కోరుకోవాలి. శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో నైపుణ్యమైన యువత మన దేశానికి మెండుగా వున్నారు. ప్రపంచంలో ఏ దేశానికి లేనంత యువ శక్తి మన దేశంలో వుంది. దాన్ని వినియోగించుకోవాల్సిన అసవరం ప్రభుత్వాలకు వుంది. కాని దాన్ని విస్మరిస్తున్నారు. మన దేశ పౌరులు ప్రపంచ దేశాలకు తమ మేధోశక్తిని వినియోగిస్తున్నారు. ఇక్కడ వారి తెలివి తేటలను వాడుకునే పాలకులు కావాలి. వారికి సరైన నమ్మకం, విశ్వాసం కలిగించే పాలకుల రావాలి. దేశాన్ని సాంకేతిక రంగంలో ముందుకు తీసుకెళ్లాలి. పొరుగున్న వున్న దేశాకంటే కొన్ని రెట్లు ముందు పురోగమించేలా చేయాలి. అందుకు పెద్ద సమయం కూడా అసవరంలేదు. పాలకుల్లో చిత్తు శుద్ధి కావాలి. లక్ష్య శుద్ధి కావాలి. అన్నదే కేసిఆర్‌ నినాదం. తను ఆచరించి చూపిస్తున్న విధానం. ఒకనాడు తెలంగాణలోని అనేక మంది యువకులు పెద్ద ఎత్తున కర్నాటక, పూన, వంటి నగరాలకు వెళ్లేవారు. తెలంగాణ రాకముందు హైదరాబాద్‌ ఐటి ఎగుమతులు రూ.15వేల కోట్లు వుంటే, ఇప్పుడు రెండు లక్షలకు పైగా ఎగుమతుల్లో టాప్‌ సెకండ్‌ ర్యాంక్‌లో వున్నాం. దేశంలోని అనేక రాష్ట్రాలనుంచి యువత పెద్దఎత్తున ఐటి కొలువు కోసం హైదరాబాద్‌ వస్తున్నారు. ఇది దేశమంతా విస్తరించాలి. అందుకు పాలకులకు సరైన ప్రణాళికా వుండాలి. అలాంటి ఆలోచన, ఆచరణ వున్న ఏకైక నాయకుడు కేసిఆర్‌. అందుకే కేసిఆర్‌ దేశ్‌కి నేత కావాలని ప్రజల కోరిక. అది త్వరలో తీరాలని, కేసిఆర్‌ నాయకత్వంలో , నేతృత్వంలో పురోగమించాలని తెలంగాణ వాదులు, టిఆర్‌ఎస్‌ నాయకుల ఆకాంక్ష. ఆ రోజులు తొందరగా రావాలని కోరుకుందాం…దేశ ప్రగతి కళ్లారా చూద్దాం..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!