కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి శాయంపేట నేటి ధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గ్రామీణ ప్రాంతాలలో బీసీ కులాల చేతివృత్తుల వారిని ప్రోత్సహించి వారిని అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి బీసీ బందు పథకాన్ని తీసుకువచ్చామనీ గొప్పలు చెప్పుకుంటున్న బిఆర్ఎస్ ప్రభుత్వం గ్రామానికి ఒకరు లేక ఇద్దరికీ చెక్కులు పంపిణీ చేయడం సిగ్గుచేటనీ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు కాంగ్రెస్ మండల పార్టీ కార్యాలయంలో ఆయన పత్రిక సమావేశంలో మాట్లాడుతూ మండలంలో సుమారుగా 582 మంది బీసీ కులస్తులు బీసీ బందు కోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం 35 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం దురదృష్టకరమన్నారు గత తొమ్మిది సంవత్సరాలుగా బీసీ ఉప కులాలను పట్టించుకోని బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలు మూడు నెలల ముందు బిసి బంధు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది అన్నారు పేద ప్రజల అభ్యున్నతి కోసమే అధికార పార్టీలోకి పోయానని చెప్పుకుంటున్న స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మండలంలో 582 మంది బీసీ కులస్తులు దరఖాస్తు చేసుకుంటే కేవలం 35 మందికి చెక్కులు పంపిణీ చేసి మిగతా వారికి పలు దపాలుగా ఆర్థిక వయవహారాల్లో స్థానిక ఎమ్మెల్యే కు రాబోయే ఎలక్షన్లలో బుద్ధి చెప్పాలన్నారు ఇకనైనా మీకు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి బీసీ సోదరునికి వెంటనే బీసీ బందు ద్వారా ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు ఎండి హైదర్,లడే రాజ్ కుమార్ పత్తి శీను ,వీరన్న, పల్లెబోయిన శ్రీనివాస్ ,మారెపల్లి రాజు, కటయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.