https://epaper.netidhatri.com/
` చెట్టు పేరు చెప్పుకొని చొచ్చుకొని వస్తున్నారు.
` ఉనికి కోసం కాచుకొని చూస్తున్నారు.
` అవకాశవాదులు ఆగం చేయాలని చూస్తున్నారు.
`తెలంగాణ నేతలను వెర్రివెంగలప్పలను చేయాలని చూస్తున్నారు.
`కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మీద పడి దోచుకోవాలని చూస్తున్నారు.
`ఉమ్మడి రాష్ట్రంలో గోస పెట్టారు.
`సమైక్య ఉద్యమం చేశారు.
`ఇప్పుడు నేను వుంటున్నది తెలంగాణే అంటున్నరు.
`కాంగ్రెస్ పంచన చేరిపోయి పాచికలు సిద్ధం చేసుకుంటున్నారు.
` తెలంగాణ రాజకీయాలు ఏలాలని చూస్తున్నారు.
`కాంగ్రెస్ లో దూరుతున్నారు!
` మరో వైపు సైకిల్ ను రిపేర్ చేస్తున్నారు.
` కాంగ్రెస్ లో చెలామణీ నేతలంతా వైఎస్ అనుచరులు.
`పొంగులేటి చేరికతో మొదలు.
` కేవిపి ప్రకటనతో బయటపడిన అసలు రంగు.
` అన్నా, చెల్లెళ్లు ఒక్కటే..
` పైకి కనిపించే పంచాయతీ అంతా ఉత్తదే!
` తెలంగాణ రాష్ట్రం మీద పెత్తనం కోసం ఆరాటమే.
` తెలంగాణ మనుగడను ఓర్చుకోలేరంతే?
నేటిధాత్రి ఏనాడో చెప్పింది. చీమ దూరే సందు దొరికితే చాలు అని సీమాంధ్ర నేతలు దూరేందుకు కా చుకొని కూర్చున్నారు. గత ఎన్నికల ముందు జట్టు కట్టుకొని వచ్చారు. వారి కడుపులో కత్తులు తెలంగాణ ప్రజలు గమనించారు. కాంగ్రెస్ పార్టీని మరింత పాతాళానికి తెలంగాణ ప్రజలు తొక్కేశారు. అయినా ఆ పార్టీకి గుణం రాలేదు. ఇంకా వెయ్యేళ్లు గడిచినా సరే తెలంగాణ లో పాలన చేయాల్సింది తెలంగాణ నాయకులే! అది తెలిసినా కాంగ్రెస్ పార్టీ కేవిపి. రామచంద్ర రావు, షర్మిల లాంటి కరుడు గట్టిన సమైక్య వాదులకు చోటు కల్పిస్తున్నారు. సీమాంధ్ర లో రాజకీయాలు చేయాల్సిన వాళ్లను మళ్ళీ తెలంగాణ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా నేటిధాత్రి ఎప్పుడో చెప్పింది. షర్మిల అసలు స్వరూపం నేటిధాత్రి ఆనాడే చెప్పింది. ఇప్పుడు అక్షరాల అదే నిజమైంది. కేవిపి పాత్ర ఎలా వుండబోతోందో కూడా చెప్పడం జరిగింది. ఇందులో ఖమ్మం జిల్లా నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాత్ర ఎలా వుంటుందన్నది కూడా నేటిధాత్రి ఆనాడే పూస గుచ్చినట్టు చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే నిజం కాబోతోంది. ఇప్పటికైనా తెలంగాణ కాంగ్రెస్ నేతలు తేరుకోకపోతే భవిష్యత్తు తెలంగాణ కాంగ్రెస్ గళ్లంతే. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి ఆగం చేస్తున్నాడు. కొత్తగా షర్మిల తన పెత్తనం కోసం పెనం మీద వున్న కాంగ్రెస్ ను పొయ్యిలో వేయడం ఖాయం. తర్వాత మిగిలిన వాళ్లతో కొత్త రాజకీయం చేయడం షర్మిల కర్తవ్యం. ఇది గత ఎన్నికల సమయం నుంచే మొదలైంది. దానిని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అర్థం చేసుకోరు. డిల్లీ కాంగ్రెస్ పెద్దలకు అర్థం కాదు.
ఒకనాడు తెలంగాణ వస్తే నష్టపోయేది తెలంగాణ ప్రజలే అంటూ భయపెట్టిన వాళ్లు తెలంగాణను చూసి కుళ్లుకుంటున్నారు. మేం లేకపోతే మీకు బతుకు లేదు, మెతుకు లేదంటూ కారడ్డమాడిన సమైక్యవాదులు ఇప్పుడు తెలంగాణ మీద పడి బతకాలనుకుంటున్నారు. దోచుకోవాలని చూస్తున్నారు. మళ్ళీ రాజకీయాలు మొదలు పెట్టి తెలంగాణ ను గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. ఆది నుంచి బానిస బతుకులకు అలవాటు పడిన కొంత మంది తాబేదార్లు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు మళ్ళీ వారి వంక ఆశగా చూస్తున్నారు. తెలంగాణ తెచ్చుకున్నాక కూడా ఊడిగం చేసే మనస్తత్వాన్ని వదులుకోవడం లేదు. ఆత్మాభిమానంతో బతకలేకపోతున్నారు. కేవలం తమ రాజకీయ పబ్బం కోసం, పరపతి కోసం, పదవుల కోసం మరో సారి తెలంగాణ ను తాకట్టు పెట్టడానికి సిద్దపడుతున్నారు. వారిని నమ్ముకొని, బానిస మనస్తత్వాల వారిని గుప్పిట్లో పెట్టుకొని తెలంగాణలో పాత రాజకీయాలు తెరమీదకు తెస్తున్నారు. తెలంగాణ ముసుగులో సమైక్యవాదులు! ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సిన పేరు కేవిపి. రామచంద్ర రావు. ఇతను దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కి ఆత్మ బంధువు. ఇప్పటికీ ఆయనను ఆత్మగానే గౌరవిస్తుంటారు. ఇప్పుడు ఆయన చిలకపలుకులు పలుకుతున్నాడు. వైఎస్ మరణం తర్వాత ఆ కుటుంబానికి దూరమయ్యాడు. ఇది అందరూ అనుకునే మాట. కానీ అసలు కథ వేరు. ఆయన ఆత్మ రూపంలో సేవ చేస్తూ వుంటారు. ఏదో రకంగా అన్న జగన్ రాజకీయ జీవితం గాడిన పడిరది. ముఖ్యమంత్రి అయ్యారు. కానీ చెల్లెలు షర్మిలకు మాత్రం పదవి లేదు. ఒక వేళ ఏదైనా పదవి తీసుకుంటే ఎంత నామోషీ! అందుకే తెలంగాణ సిఎం అవుతా? అన్న అక్కడ… చెల్లి ఇక్కడ. ఇల్లు వేరు పడినా పెత్తనం కూడా ఇద్దరూ సమానంగా పంచుకుందామనుకుంటున్నారు. అందుకే మధ్యలో మళ్ళీ తెరమీదకు కేవిపి వచ్చేశారు. నేను ఈడా వుంట…ఆడా వుంట…ఎక్కడ పుల్ల పెట్టే అవసరం వస్తే అక్కడ వాలిపోతా! ఆత్మ అంటే నిజంగానే ఆత్మలా వ్యవహరిస్తా! నేను సైలెంట్ గా వుంటే ఖాళీగా వున్నట్లు కాదు… మౌనంగా వుంటే మాట్లాడకుండా వున్నట్లు కాదు. కళ్లు కాపాలా కాస్తూనే వుంటాయి. నొసలు సైగలు చేస్తూనే వుంటుంది. ఎప్పుడు ఎక్కడ ఎలా నెగ్గాలో తెలుసు. తగ్గినట్లు నటించడం తెలుసు. అందుకే నంగచాచి ముచ్చట్లతో తెలంగాణ ముందుకు వస్తున్నారు. తెలంగాణ బానిస నాయకులను ఏ మార్చి పెత్తనం చేసేందుకు వస్తున్నారు.
చెట్టు పేరు చెప్పుకొని చొచ్చుకొని వస్తున్నారు. అసలు వైఎస్ రాజశేఖరరెడ్డి అనే చెట్టే తెలంగాణ కు చెదపట్టించిన నాయకత్వం.
తెలంగాణను ఆగం చేసిన దిక్కుమాలిన తనం. ఇంకా ఆ కుంపటి తెలంగాణకు ఎందుకు? ఇక జీవితంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేని నాడు, తెలంగాణ పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన నాయకుడు వైఎస్. 2004 లో అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకొని గెలిచింది వైఎస్. ఆ గెలిపించిన తెలంగాణ వాదాన్ని అణచివేతకు గురి చేసింది వైఎస్. తెలంగాణ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి, మాట మార్చిన నాయకుడు వైఎస్. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ కు శాపం వైఎస్ నాయకత్వం. అప్పటి దాకా జై తెలంగాణ అన్న కాంగ్రెస్ నాయకులు వైఎస్ అంటే భయానికి నోరెత్తలేదు. ఆత్మ గౌరవం చూపుకోలేదు. ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది మేమే! సన్నాయి నొక్కులు నొక్కుతున్న కాంగ్రెస్ నేతలకు ఈ నోరు ఆ నాడెందుకు మూతపడిరది. మూగబోయింది. సీమాంధ్ర నాయకుల పెత్తనానికి ఎందుకు భయపడిరది. ఎందుకు లొంగిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులకు తెలంగాణ కంటే పదవులు ముఖ్యం. అధికారం ముఖ్యం. పరపతి ముఖ్యం. పరాన్న బుక్కులుగా బతకడం ఇష్టం. తెలంగాణ సంపద దోచుకుపోయే అవకాశం సీమాంధ్ర నేతల చేతుల్లో పెట్టి, వాళ్లు విసిరే ఎంగిలి మెతుకులకు అలవాటు పడిన నేతలు అంతకంటే ఏం చేయగలరు. ఇప్పటికీ ఏం చేయలేరు. మళ్ళీ సీమాంధ్ర నేతలొచ్చి ఏలుతామంటే సహకరిస్తారు. వారిని అందలమెక్కించి జై కొడతారు. అసలు 1956 తెలంగాణ రాష్ట్రాన్ని సీమాంధ్ర ప్రాంతంలో విలీనం చేసిందే కాంగ్రెస్ పార్టీ. 1969లో మూడు వందలకు పైగా తెలంగాణ ఉద్యమ కారులను కాల్ఛి చంపింది కాంగ్రెస్ పార్టీ. 1971లో తెలంగాణ కావాలని ప్రజలు బలంగా కోరుకొని 11 మంది ఎంపిలను గెలిపిస్తే మోసం చేసింది కాంగ్రెస్. 2004 ఎన్నికలలో బిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని గెలిచి, పదేళ్ల కాలయాపన చేసింది కాంగ్రెస్. ఫలితంగా వేయి మంది తెలంగాణ బిడ్డల ప్రాణాలు పోవడానికి కారణమైనది కాంగ్రెస్. ఇప్పుడు తగుదునమ్మా! అని మళ్ళీ సీమాంధ్ర నేతలను వెంటబెట్టుకొని వస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇంతకన్నా దౌర్బాగ్యమేమైనా వుంటుందా? మరో సారి తెలంగాణ ను ఆగం చేయమని, సీమాంధ్ర నేతలకు స్వాగతం పలుకుతున్నది నిజం కాదా! ఇంకా ప్రజలు కాంగ్రెస్ ను నమ్మాలా?
ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం సోనియా గాంధీ.
తెలంగాణ ప్రజల బలమైన ఆకాంక్ష నెరవేరకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన సీమాంధ్రులనే ఆనాడు నమ్మింది. తెలంగాణ ప్రకటించిన రోజే పార్టీ మీద తిరుగుబాటు చేసి రాజీమాలు చేసి, పార్టీ అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేసిన కాంగ్రెస్ సీమాంధ్ర నాయకులనే నమ్మింది. ఇప్పుడు వారి మాటలే వింటోంది. 2004 తెలంగాణ రాష్ట్ర సమితి తో జతకట్టకుండా వుంటే కాంగ్రెస్ ఆనాడు అధికారంలోకే వచ్చేది కాదు. పైగా తెలంగాణ అరవై ఏళ్ల ఆకాంక్షను గౌరవించాల్సిన సమయంలో పిడికెడు మంది సీమాంధ్ర నాయకుల మాటలు సోనియా గాంధీ నమ్మింది. ఆఖరుకు సీమాంధ్ర లో పార్టీని స్వయంగా చంపేసిన షర్మిల లాంటి వాళ్లతో మళ్ళీ సంప్రదింపులు జరుపుతోంది. పైగా షర్మిలను తెలంగాణ రాజకీయాల మీదకు పంపుతోంది. తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ మీద గౌరవం లేదని, తెలంగాణ ఇచ్చిన కృతజ్ఞత లేదని మళ్ళీ లేనిపోనివి చెప్పి కొత్త రాజకీయం సీమాంధ్రులు మొదలుపెడుతున్నారు. అందులో క్రియాత్మక పాత్ర ను కేవిపి పోషిస్తున్నారు. ఉనికి కోసం కాచుకొని చూస్తున్నారు. అవకాశవాదులు మళ్ళీ తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నారు. తెలంగాణ నేతలను వెర్రివెంగలప్పలను చేసి ఆడిరచిన వాళ్లే, మళ్ళీ వారిని చెప్పు చేతుల్లోకి తెచ్చుకోవాలని చూస్తున్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మీద పడి దోచుకోవాలని చూస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో గోస పెట్టారు. సమైక్య ఉద్యమం చేశారు.
ఇప్పుడు నేను వుంటున్నది తెలంగాణే అంటూ కేవిపి సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. నేనూ తెలంగాణే, నాది తెలంగాణే అంటున్నరు. మళ్ళీ తెలంగాణ కాంగ్రెస్ పంచన చేరిపోయి పాచికలు సిద్ధం చేసుకుంటున్నాడు. తెలంగాణ రాజకీయాలు ఏలాలని చూస్తున్నారు. కాంగ్రెస్ లో దూరుతున్నారు! మరో వైపు సైకిల్ ను రిపేర్ చేస్తున్నారు. కాంగ్రెస్ లో చెలామణీ నేతలంతా వైఎస్ అనుచరులే కావడం గమనార్హం. పొంగులేటి చేరికతో మొదలు. కేవిపి తాజా ప్రకటనతో బయటపడిన అసలు రంగు బయటపడిరది. అన్నా, చెల్లెళ్లు ఒక్కటే.. పైకి కనిపించే పంచాయతీ అంతా ఉత్తదే! అని తెలిపోయింది. మబ్బులు ఇప్పుడే వీడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం మీద పెత్తనం కోసం ఆరాటమే. తెలంగాణ మనుగడను ఓర్చుకోలేరంతే?. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు, ఈ తరం యువత అసలు నిజాలు తెలుసుకోవాలి. పరాయి గద్దలు తెలంగాణ గడ్డ మీద వాలేందుకు వస్తున్నాయి. రాబందుల మాదిరిగా మారి దోచుకొనేందుకు కాచుకొని చూస్తున్నాయి. నంగనాచి వేషాలు ఎన్ని వేయాలో అన్నీ వేస్తారు. నటిస్తారు. నమ్మిస్తారు. నట్టెట ముంచుతారు. మళ్ళీ తెలంగాణను ఆగం చేస్తారు. పరాయి వాళ్లు పక్కింటి మీద పడి దోచుకోవాలనే చూస్తారు. సీమాంధ్ర నేతలూ అంతే. అక్కున చేర్చుకుంటారు. కడుపు నిండా విషం నింపుకొని, కావలిచ్చుకుంటారు. కళ్లు మూసి తెరిచే లోపు కళ్లకు గంతలు కట్టేస్తారు. కనికట్టు చేస్తారు. పదవుల బొక్కలు విసిరి బానిసలు చేసుకుంటారు. అరవై ఏళ్లు జరిగిందదే…మళ్ళీ అవకాశం దొరికితే పెత్తనం చేద్దామని వస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త!!!