ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు మూడు తరాల ఉద్యమ యోధుడు శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో
మహానీయుడికి నివాళులు అర్పిస్తూ తొలి మలి దశ లో తెలంగాణ పోరాటంలో మొదటి నుండి ముందు ఉండి తనదైన శైలిలో పోరాడిన ఘనత బాపూజీవి అన్నారు స్వరాష్ట్రం కోసం తన మంత్రి పదవిని రాజీనామా చేసి పోరాటానికి పదునెక్కించిన మహనీయుడని తెలిపినారు
పద్మశాలీలను ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేశాడని చేనేత సహకార సంఘాలను నెలకొల్పుటకు తన శక్తి వంచన లేకుండా కృషి చేశారని కొనియాడారుకొద్ది నెలల్లో జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాలని పద్మశాలీలను వంచన చేస్తున్న ప్రధాన రాజకీయ పార్టీలకు తగిన రీతిలో బుద్ధి చెప్పుటకు కుల బంధువులందరూఐక్యమత్యంతో పని చేయాలనికోరుట్ల, సరూర్న స్టేడియంలో జరిగిన భారీ బహిరంగ సభలో తీసుకున్న నిర్ణయానికి పార్టీలకతీతంగా
పద్మశాలి ముద్దుబిడ్డలు స్వతంత్రంగానైనా ఇతర రాజకీయ పార్టీల తరఫున పోటీ చేసిన వారిని గెలిపించుకొనుటకు కృషి చేయాలని అన్నారుఈ కార్యక్రమంలో వంగర సాంబయ్య, చిందం రవి, బాసాని ప్రకాష్, బాసాని సదాశివుడు,ఆడెపు అశోక్, బూర కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.