చేర్యాల నేటిధాత్రి…
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తాడూరులో చేర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని షీ టీం సభ్యులు స్వప్న,శివకుమార్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి, వారి టీం పాఠశాలలోని విద్యార్థులకు షీ టీం పై అవగాహన కల్పిస్తూ విద్యార్థినీ విద్యార్థులు సోదర భావంతో మెలగాలని అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకొని బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, ఏ చిన్న సమస్య ఉన్న షీ టీం మెంబర్స్ కు సమాచారం అందించాలని, విద్యార్థులకు డయల్ 100 పై ప్రత్యక్షంగా డెమో ఇచ్చి విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ తాటికొండ శ్రీరాములు, ఉపాధ్యాయులు జ్యోతి, శ్రీనివాస్, సుధాకర్ పాల్గొన్నారు.