ఢిల్లీ ధర్నాలో పాల్గొన్న: వద్దిరాజు రవిచంద్ర 

వరంగల్, ఏప్రిల్, 11:

 

తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్రం తక్షణమే కొనుగోలు చేయాలనే డిమాండ్ తో టీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ లో తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) పాల్గొన్నారు.ముందుగా ఢిల్లీ తెలంగాణ భవన్ వద్ద సీఎం కేసీఆర్,

మంత్రి కేటీఆర్ లను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మరియు శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య.ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తో కలిసి వరి కంకులు పట్టుకుని ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించే సభ ప్రాంగణంకి చేరుకున్నారు. అంతకు ముందు ఎంపీ నామా నాగేశ్వరరావు గారి ఆహ్వానం మేరకు ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చెర్మెన్ V. ప్రకాష్ గారి తో కలిసి ఆతిథ్యం స్వీకరించారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *