రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన ధర్మపత్ని విజయలక్ష్మీతో కలిసి దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవాలకు హాజరయ్యారు.రాజ్యసభ సభ్యుడి హోదాలో ఆయన మొట్టమొదటి సారి ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు.త్రివిధ,పారా మిలటరీ దళాల కవాతు, విన్యాసాలు, వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాల ప్రదర్శనను తిలకించారు.ఈ సందర్భంగా రవిచంద్ర దేశ ప్రజలకు, విదేశాలలో స్థిరపడిన,నివాసం ఉంటున్న భారతీయులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఢిల్లీలో గణతంత్ర దినోత్సవాలలో పాల్గొన్న ఎంపీ రవిచంద్ర, విజయలక్ష్మీ దంపతులు
