చేవెళ్ళలో మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా పలు అంగన్వాడీ కేంద్రాల్లో ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ దేవర సమత వెంక
టరెడ్డి నేతృత్వం వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీనేజ్ లో గర్భధారణ మరియు ఎలోప్మెంట్ వంటి సమస్యలపై యువతకు అవగాహన అవసరమని పేర్కొన్నారు. అమ్మాయిలు మోసపూరిత మాటలకు లోనవకుండా తమ భవిష్యత్తును కాపాడుకోవాలని సూచించారు.
సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించి చదువు, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
