రాజన్న సిరిసిల్లజిల్లా ప్రతినిధి నేటిదాత్రి సిరిసిల్ల పట్టణంలోని బైపాస్ సమీపంలో నిర్మాణంలో ఉన్న నూతన జిల్లా పోలీస్ కార్యాలయంను సోమవారం నాడు
ఇంజనిర్లతో జిల్లా పోలీస్ అధికారులతో కలిసి సందర్శించి జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ ..
జిల్లా ప్రజలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సత్వర పోలీస్ సేవలుఅందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకoగా అన్ని హంగులతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాల సముదాయాన్ని వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకరావాలని జిల్లా ఎస్పీ హోసింగ్ ఏ. ఈ కి సూచించారు.నూతన జిల్లా పోలీస్ కార్యాలయాల సముదాయాన్ని సందర్శించి నూతన భవనా నిర్మాణం జరిగిన తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించి నిర్మాణ దశలో పెండింగ్ లో ఉన్న పనుల వేగవంతంకు చేపట్టాల్సిన చర్యలు, తదితర అంశాలపై మరియు త్వరగతిన పూర్తి చేయడానికి తీసుకుంటున్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ పై ఇంజనీర్లతో సమీక్షించారు..
ఎస్పీ వెంట అదనపు ఎస్పీ చంద్రయ్య,డిఎస్పీ లు చంద్రశేఖర్,నాగేంద్రచారి, రవికుమార్, ఏ.ఈ రాజశేఖర్ ,సి.ఐ లు ,ఆర్.ఐ లు ఎస్.ఐ లు పాల్గొన్నారు…