రామాయంపేట(మెదక్)నేటి ధాత్రి.
రామాయంపేట మున్సిపాలిటీ చైర్మన్ గౌరవ పల్లె జితేందర్ గౌడ్ జన్మదిన వేడుకలను సోమవారం రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేకు కట్ చేసి జన్మదిన కార్యాలయంలో లో పాల్గొన్న వారు మాట్లాడుతూ కరోనా సమయంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నిత్యవసర సరుకులు పంపిణీ రోజుకు రెండువేల మంది చొప్పున రెండు నెలలు దాతల తోటి బాటచారులు కు భోజనాలు పెట్టించిన ఘనత చైర్మన్ కు దక్కింది అన్నారు. ఎంతోమందికి సేవలందించిన మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ నిండు నూరేళ్లు ఆరోగ్య ఉండాలని కోరుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ జి. శ్రీనివాసన్, మేనేజర్ శ్రీనివాస్, Ae యుగంధర్, నవాజ్ ప్రసాద్ కాలేరు ప్రసాద్, శ్రీధర్ రెడ్డి ,నరేష్ ,బల్ల శ్రీనివాస్, పద్మ,మనోజ్ ,ప్రభాకర్, వెలమల శ్రీనివాస్, చిలుక కృష్ణ, ఆకారం ప్రసాద్ పాల్గొన్నారు.