కేసముద్రం (మహబూబాబాద్), నేటిధాత్రి:
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు జన్మదినం సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల మురళి,పట్టణ ఉపాధ్యక్షులు చేడివెల్లి ఏలెందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శాలువాతో సన్మానించి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం ఆసుపత్రి లో రోగులకు పండ్లును పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి తాజుద్దీన్,టౌన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి రషీద్ ఖాన్,రమేష్,పట్నాయక్ ఏలేందర్ తదితరులు ఉన్నారు.