వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బంధన పల్లి గ్రామ శివారు చెరువులో ఉపాధి హామీ పథకం కింద చెరువు పూడిక పనులు చేస్తున్న ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి వారి
సమస్యలను అడిగి తెలుసుకుని వారితో కలిసి గడ్డపార పట్టి మట్టిని తవ్విన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి తో పాటు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ శరత్ కుమార్ వున్నారు .ఈ సందర్భంగా పనులు జరుగుతున్న తీరును కూలీలను అడిగి తెలుసుకున్నారు వారికి
సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటూ ఆరా తీశారు,పనులు జరుగుతున్న తీరును చూసి సంతోషం వ్యక్తం చేసి అనంతరం కూలీలను , అధికారులను అభినందించారు