కూడా మాజీ డైరెక్టర్, బీఆర్ఎస్ పార్టీ మండల సమన్వయకర్త బిల్లా యాదగిరి
వేలేరు:నేటి ధాత్రి
క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడుతాయని కూడా మాజీ డైరెక్టర్, బీఆర్ఎస్ పార్టీ మండల సమన్వయ కర్త బిల్లా యాదగిరి అన్నారు. గురువారం వేలేరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రూ.20 వేల విలువగల హకీ బ్యాట్లు, బాల్స్, టీ షర్ట్ లు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ….క్రీడల వలన నాయకత్వ లక్షణాలు పెంపోందుతాయని, క్రీడల్లో గెలుపోటములు సహజమని అన్నారు. రాబోయే రోజుల్లో క్రీడాకారులకు ఎలాంటి సహాయం కావాలన్న తన వంతు సహకారం అందిస్తానని హమీ ఇచ్చారు. హైస్కూల్ లో ఉన్న సమస్యలు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం నాగ కుమారి, కొత్తకొండ దేవస్థానం డైరెక్టర్ మఠం శ్రీశైలం, బీఆర్ఎస్ వీ మండల అధ్యక్షులు బంక శ్రీనివాస్, యూత్ నాయకులు ఇట్టబోయిన మహిపాల్,నాగరాజు, రాకేష్, అనిల్, సాంబరాజు, విధ్యార్థులు పాల్గొన్నారు.